
భద్రాచలం
భద్రచలంలో ఒక భవనం కూలిన ఘటనలో కార్మికుడు మృతి చెందాడు. దాదాపు పదకొండున్నర గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని, కామేష్ మృత్యువుతో పోరాడాడు. రెస్క్యూ చేసి కాపాడిన 10 నిమిషాలకే కామేష్ మృతి చెందాడు. భవన శిథిలాల కింద నుంచి రక్షించి, హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించగాఅక్కడ కామేష్ మృతి చెందాడు. శిథిలాల కింద మరొకరు చిక్కుకున్నట్టు సమాచారం. మొదట ఆరుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చినా.. ఇద్దరు మాత్రమే చిక్కుకున్నారని, అందులో ఒకరు మృతి చెందారని అధికారులు నిర్ధారించారు.