YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓయూలో విద్యార్ది సంఘాల నిరసన

ఓయూలో విద్యార్ది సంఘాల నిరసన

హైదరాబాద్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని పరిరక్షించాలని ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హెచ్ సియు కు చెందిన 400 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని మండిపడ్డారు. విద్యార్థుల నిరసనతో ఓయూలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, పన్నులు వసూలు చేయడం చేతగాక అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను దాక్కుంటుందని  మండిపడ్డారు. హెచ్సియు లో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కోడాన్ని బీఆర్ఎస్వి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హెచ్ సి యు కి సంబంధించి వేలం వేసిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 400 ఎకరాల భూమిని తక్షణమే యూనివర్సిటీమీ కేటాయించాలని విద్యార్థులు నిరసన తెలియజేస్తే లాఠీ ఛార్జ్ లు అరెస్టులు చేసి జైల్లో పెట్టారన్నారు. జైల్లలో పెట్టిన వాళ్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు..

Related Posts