
న్యూఢిల్లీ
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివిధ దేశాల నాయకులు ఎక్స్ లో పోస్టులు పెట్టారు. దాడిలో నష్టపోయిన వారి ఆలోచనలు నా మదిలో మెదులుతున్నాయని యూకే ప్రధాన మంత్రి కేయర్ స్టామర్ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జర్మన్ ఛాన్స్లర్ అన్నారు. ఈ సమయంలో యూరప్ మీతో ఉంటుందని ఈయూ కమిషన్ ఛైర్మన్ ఉర్సులా వాన్ డి లెయెన్ ఎక్స్ లో తెలిపారు. వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తమయ్యాయి.