
విజయవాడ, ఏప్రిల్ 28,
ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యారంగ సంస్కరణలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన 117 జీవో రద్దు చేసి మొత్తం 9 రకాల బడుల విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రాథమిక జాబితాను రూపొందించారు.కూటమి ప్రభుత్వం విద్యారంగ సంస్కరణలపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ-117ను రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా 9 రకాల పాఠశాలలు తీసుకురాబోతుంది. ఇందుకు సంబంధించి అధికారులు ప్రాథమిక జాబితాను రూపొందించారు. ఇప్పటి వరకు ఉన్న 6 రకాల బడులు స్థానంలో మరో మూడు జోడించి 9 రకాల బడుల విధానం అమలు చేయనున్నారుఉన్నత పాఠశాలలో 4 రకాలు, ప్రాథమిక పాఠశాలల్లో 45 మంది లోపు ఉంటే బేసిక్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా పిలుస్తారు. 45 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే తరగతికొక టీచర్ను కేటాయిస్తారు. వీటిని ఆదర్శ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా పిలుస్తారు. 1-10 తరగతులుంటే బేసిక్, ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 900 వరకు ఏర్పాటు చేయనున్నారు.కొన్ని ప్రాథమికోన్నత స్కూల్స్, ఇంటర్మీడియట్తో కలిపి హైస్కూల్ ప్లస్లుగా కొనసాగిస్తారు. క్షేత్రస్థాయి పరిస్థితుల కారణంగా 240కి పైగా ప్రాథమికోన్నత బడులను కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది.ముందుగా 5 రకాల బడులను తీసుకురావాలని భావించినప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితుల నేపథ్యంలో మొత్తం 9 రకాలు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి నూతన బడుల విధానం అమల్లోక రానుంది.
9 రకాల బడులు
అంగన్వాడీలను మార్పు చేసి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్- 1, 2 (ఎల్కేజీ, యూకేజీ) బడులను శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ గా ఏర్పాటు చేస్తారు. వీటిని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించనుంది.
ప్రీ ప్రైమరీ-1, 2తో పాటు ఒకటి, రెండో తరగతులు కలిపి ఫౌండేషన్ పాఠశాలలుగా పిలుస్తారు.
పీపీ-1, 2తోపాటు 1-5 తరగతులు ఉండే పాఠశాలలను బేసిక్ ప్రైమరీ స్కూల్స్ గా ఏర్పాటు చేస్తారు. 1-5 తరగతుల్లో 45 మందిలోపు పిల్లలుంటే వాటిని బేసిక్ ప్రైమరీ స్కూల్స్ గా పరిగణిస్తారు.
పీపీ-1, 2, ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ఉండి, 45 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా పరిగణిస్తారు.
ప్రాథమికోన్నత పాఠశాలలు కొనసాగనున్నాయి. 6, 7, 8 తరగతుల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొన్నింటిని ఉన్నత పాఠశాలలుగా, మరికొన్నింటిని ప్రాథమిక పాఠశాలలుగా పరిగణిస్తారు.
6 నుంచి 10 తరగతులు వరకు ఉన్నత పాఠశాలలు ఉంటాయి.
1-10 తరగతులు ఉంటే బేసిక్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా పరిగణిస్తారు. జీఓ-117 రద్దుతో 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకొచ్చి వీటికి 1, 2 తరగతులను జోడించారు.
1-10 తరగతులు ఉంటే ఆదర్శ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేసి, ప్రాథమిక బడుల్లో 45 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే తరగతికి ఒక్క ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు.
రాష్ట్రంలో మొత్తం 294 హైస్కూల్ ప్లస్లు కొనసాగిస్తారు. వీటిల్లో 1-12 లేదా 6-12 తరగతులు ఉంటాయి.