YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతికి మహర్దశ

అమరావతికి మహర్దశ

అమరావతి, ఏప్రిల్ 28, 
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారయింది. మే 2వ తేదీన ప్రధాని అమరావతి పర్యటనకు వస్తున్నారు. రాజధాని పునర్మిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం కూడా అధికారికంగా ప్రకటిచింది. ప్రధాని సాయంత్రం నాలుగు గంటలకు అమరావతికి చేరుకుని దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉంటారు. అయితే ప్రధాని మోదీ ఈసారి కీలక ప్రకటనలు చేయనున్నారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు గత ఐదేళ్లుగా రాజధాని లేకుండా పోయింది. అమరావతిలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత వచ్చి నాలుగు మాటలు, మూట మట్టి ఇచ్చి, నీళ్లు ఇచ్చిపోయారన్న విమర్శలు అప్పట్లో బలంగానే వినిపించాయి. పరిస్థితులు వేరుగా ఉండటంతో... అయితే 2014 నాటి పరిస్థితులు... 2024 నాటి పరిస్థితులు రాజకీయంగా వేరుగా ఉన్నాయి. నాడు మోదీకి చంద్రబాబు అవసరం లేదు. నేడు మాత్రం మోదీకి చంద్రబాబు మద్దతు ఖచ్చితంగా ఉండాలి. అందుకే నాడు అమరావతి నిర్మాణానికి పెద్దగా నిధులు కానీ, ప్రకటనలు కానీ చేయకుండా వెళ్లిపోయారని అంటున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల రుణాన్ని అప్పుగా ఇవ్వడానికి కేంద్ర అనుమతి ఇచ్చింది. వరల్డ్ బ్యాంకు, ఆసియన్ డెవలెప్ మెంట్ బ్యాంకు నుంచి కలిపి పదిహేను వేల రూపాయలు, హడ్కో నుంచి మరో పదకొండు వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని అమరావతి తొలి దశ పనులను వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు.నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. మోదీ శంకుస్థాపన తర్వాత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, మూడేళ్లలో పనులు పూర్తి చేసి అమరావతికి రూపు రేఖలు తీసుకు రావాలన్నలక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఈ సమయంలో రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోదీ ఖచ్చితంగా మంచి సానుకూల ప్రకటన చేస్తారని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థల ఏర్పాటుకు ఇప్పటికే అమరావతిలో భూములు కేటాయించారు. వాటి ఏర్పాటు కూడా సత్వరం పూర్తయ్యేలా ప్రధాని ప్రకటన ఉండే అవకాశముంటుందని చెబుతున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సాయాన్ని కూడా అందించే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేకపోతున్నారు... ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారయింది. మే2న సాయంత్రం నాలుగు గంటలకు అమరావతి పునర్మిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. పదిహేను నిమిషాల పాటు రోడ్ షో ఉంటుంది. తర్వాత బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం సచివాలయం వెనక భారీ వేదికను సిద్ధం చేశారు. మూడు గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాప్ట్ లో అమరావతికి చేరుకుంటారు. అనంతరం 1.1 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత అమరావతి పెవిలియన్ ను సందర్శించి సాయంత్రం ఐదు గంటల వరకూ సభలో ప్రసంగించి తిరిగి ఢిల్లీకి బయలుదేరిసుమారు 5 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు ప్ర‌ధాని స‌భ‌కు వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. దానికి త‌గిన‌ట్లుగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయన్నారు మంత్రి నారాయ‌ణ‌. E 11,E13,E 15 రోడ్ల‌తో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి రాక‌పోక‌లు జ‌రుగుతాయి. ఇప్ప‌టికే పోలీస్ శాఖ రోడ్లు ప‌రిశీలించి గుంత‌లు పూడ్చాల‌ని సూచించింది.. ప్ర‌ధాని స‌భ‌కు వ‌చ్చే వాహ‌నాల కోసం మొత్తం 11 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటుచేస్తున్నారు.మొత్తం 8 రోడ్ల ద్వారా స‌భా వేదిక వ‌ద్ద‌కు చేరుకోవచ్చుమంగ‌ళ‌గిరి నుంచి రెండు రోడ్లు. తాడేప‌ల్లి నుంచి ఒక‌టి,వెస్ట్ బైపాస్ నుంచి ఒక‌టి, ప్ర‌కాశం బ్యారేజి నుంచి రెండు, తాడికొండ నుంచి ఒక‌టి, హ‌రిశ్చంద్రాపురం నుంచి ఒక రోడ్డు ద్వారా స‌భా వేదిక వ‌ద్ద‌కు చేరుకోవ‌చ్చు. వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్ కు అవ‌కాశం లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామని పోలీస్ శాఖ తెలిపింది. పోలీస్ శాఖ సూచన‌ల మేర‌కు రెండు రోజుల్లోగా రోడ్ల‌న్ని స‌రిచేయాల‌ని సీఆర్డీఏ అధికారుల‌కు ఆదేశించిన‌ట్లు మంత్రి నారాయ‌ణ చెప్పారు. ఈ స్వల్ప మార్పులు మినహా ప్రధాని మోదీ అమరావతి పర్యటన లో ఎలాంటి చేంజెస్ ఉండవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts