YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆర్ధిక కష్టాల్లో బుట్టా...

ఆర్ధిక కష్టాల్లో బుట్టా...

కర్నూలు, ఏప్రిల్ 28, 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ బుట్టా రేణుకకు చెందిన ఖరీదైన ఆస్తులను ఎల్ఐసీ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ వేలం వేస్తోంది. రూ. 310 కోట్ల రూపాయలు రుణం తీసుకుని చెల్లించడం మానేశారు. నెల వాయిదాలు కూడా చెల్లించడం లేదు. దీంతో గతంలోనే ఆమె ఆస్తులను వేలం వేసే ప్రక్రియను ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ ప్రారంభించింది. బంజారాహిల్స్ లో ఉన్న ఐదు వేల గజాల స్థలం, మాదాపూర్ లో ఉన్న బుట్టా కన్వెన్షన్  సెంటర్ ను వేలానికి పెట్టింది. గతంలో వేలానికి పెట్టినా తర్వాత ఇబ్బందులు వస్తాయని ఎవరూ రాకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు ఆమె ప్రజాప్రతినిధి కాకపోవడంతో పాటు వైసీపీ కూడా ఏపీలో అధికారంలో లేదు. అందుకే తమకు రావాల్సిన రూ.340 కోట్ల రూపాయలను బంజారాహిల్స్ లోని ఐదు చదరపు గజాలను, మాదాపూర్ లోని బుట్టా కన్వెన్షన్ సెంటర్ ను అమ్మకానికి పెట్టి రికవరీ చేసుకోవాలని ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ నిర్ణయం తీసుకుంది.  బుట్టా రేణుక కుటుంబానికి  స్కూళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, కార్ డీలర్ షిప్‌లు ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి.   బుట్టా రేణుక వెైఎస్ఆర్‌సీపీ నుంచి  రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో ఆమె వైసీపీ తరపు నుంచి  కర్నూలు లోక్ సభకు ఎంపికయ్యారు. అయితే ప్రభుత్వంలోకి టీడీపీ రావడంతో ఆమె చంద్రబాబును కలిశారు.  బుట్టా రేణుక భర్త టీడీపీ కండువా కప్పుకున్నారు. బుట్టా రేణుక మాత్రం అనర్హతా వేటు పడుతుందన్న  కారణంగా టీడీపీలో చేరలేదు. కొన్ని రోజులకు మళ్లీ టీడీపీకి  దూరయ్యారు. ఎన్నికలకు ముందు అధికారికంగా మళ్లీ వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లభించలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోనే కొనసాగారు. కానీ ఎలాంటి పదవులు లభించలేదు. 2024 ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టిక్కెట్ ను ఆశించారు. అయితే సీఎం జగన్ మాత్రం ఆమెకు ఎమ్మిగనూరు టిక్కెట్ కేటాయించారు. ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ నిరాకరించి బుట్టా రేణుకకు సీటు కేటాయించారు. అయితే కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్‌సీపీ తుడిచి పెట్టుకుపోయింది. ఎమ్మిగనూరులోనూ ఓడిపోయింది. ఎన్నికల ప్రచార సభల్లో జగన్ అభ్యర్థులను పరిచయం చేసేటప్పుడు బుట్టా రేణుకను సౌమ్యురాలు.. డబ్బులు కూడా అంతంతమాత్రమే అని పరిచయం చేశారు. అయితే తనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని బుట్టా రేణుక యూట్యూబ్ ఇంటర్యూల్లో చెప్పిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. బుట్టా రేణుకను ట్రోల్ చేశారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలోనే  ాస్తుల వేలం ప్రకటన వచ్చింది. తమ ఆస్తుల వేలంపై బుట్టా రేణుక కుటుంబం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. డిఫాల్ట్ అయినందున.. వారు ఆస్తుల్ని అమ్ముకుని రికవరీ చేసుకోవచ్చని వదిలేసినట్లుగా చెబుతున్నారు. బుట్టా రేణుక విజయవంతమైన వ్యాపారవేత్త అని.. రాజకీయాల్లోకి వచ్చి ఆమె నష్టపోయారని ఆమె అనుచరులు అంటున్నారు. 

Related Posts