
తిరుమల
వేసవి సెలవులు ప్రారంభం అయిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 45 రోజులపాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. మే 1వ తేదీ నుంచి జూన్ 15 వ తేదీ వరకు ప్రజా ప్రతినిధుల, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు విఐపి బ్రేక్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది.