
విశాఖపట్నం
విశాఖ నగర మేయర్గా పీలా శ్రీనివాసరావు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం జీవీఎంసీ కార్యాలయంలో భారీ ఉత్సాహం మధ్య జరిగింది. మేయర్గా పీలా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కూటమి నేతలు, కార్య కర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యాలయం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. మేయర్కు శుభాకాంక్షలు తెలపడానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతిని ధులు, స్థానికులు కూడా వచ్చారు.
జీవీఎంసీ సమావేశంలో కోరం సరిపోవడంతో మేయర్ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి పేరు పీలా శ్రీనివాస్ ను ఎమ్మెల్యే వంశీకృష్ణ బలపరిచారు. బీజేపీ నుంచి ఎన్డీయే అభ్యర్థి గా పీలా శ్రీనివాస్ ను సెకండ్ ప్రొపోజ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసారు. దాంతో మేయర్ గా పీలా శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రకటించారు.