YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వరస భేటీలు..యుద్ధ మేఘాలు

వరస భేటీలు..యుద్ధ మేఘాలు

శ్రీనగర్, మే 5,
వినిపిస్తోందా పాకిస్తాన్‌. ఇది మోదీ లేటెస్ట్‌ వార్నింగ్‌. ఆయన చెప్పారంటే చేస్తారంతే.. సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్‌కు సూటిగా మోదీ వార్నింగ్‌ ఇచ్చేశారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందా? రివెంజ్‌ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ అయిందా? ఈ నెల 9న జరగనున్న రష్యా విక్టరీ పరేడ్‌కు మోదీ, రాజ్‌నాథ్‌ సహా భారత్‌ అగ్ర నేతలు ఎవ్వరూ వెళ్లడం లేదు. రష్యా టూర్‌ రద్దు చేసుకుని మరీ మోదీ అదే కసరత్తులో ఉన్నారా? భద్రత, యాక్షన్ ప్లాన్‌పై మోదీ, రాజ్‌నాథ్‌ నేరుగా సమీక్షించడాన్ని ఎలా చూడాలి. ఇక త్రివిధ దళాల అధిపతులతో కీలక సమావేశాలు పూర్తయ్యాయి. దేశవిదేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులు పూర్తయ్యాయి.ఈ నెల 9లోపు పాకిస్తాన్‌పై సైనిక చర్య షురూ కానుందా? అసలు సైనికచర్య అంటే ఏంటి? డైరెక్టుగా ఉగ్రవాదులను లేపేస్తే…అవి సర్జికల్‌ స్ట్రైక్స్‌. ఆ ఉగ్రవాదుల వెనుక ఉన్న పాక్‌కి బుద్ధి వచ్చేలా యుద్ధం ప్రకటిస్తే… అది సైనిక చర్య. దీనికోసమే ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక కలలో కూడా ఊహించని రీతిలో ఉగ్రవాదులను శిక్షిస్తామని కొద్ది రోజుల క్రితమే బిహార్‌లో మోదీ చెప్పారు.ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఇండియన్‌ నేవీ చీఫ్‌ దినేష్‌ త్రిపాఠి భేటీ అయ్యారు. అరేబియా సముద్రంలో నౌకా దళ సన్నద్ధతపై చర్చించారు. అంతకు ముందు ప్రధాని మోదీతో జమ్ముకశ్మీర్‌ సీఎం అబ్దుల్లా భేటీ అయ్యారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై చర్చించారు. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత మోదీతో ఆయనకు ఇది తొలి సమావేశం కావడం గమనార్హం.

Related Posts