
విజయవాడ
విజయవాడ ఇస్కాన్ టెంపుల్ గ్రౌండ్ లో జనసేన ఆధ్వర్యంలో "సుపరిపాలన మొదలై ఏడాది" కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హజరయ్యారు.
*రాష్ట్రం లో వైసిపి పాలన "పీడ విరగడై ఏడాది" ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సుపరిపాలన మొదలై సంవత్సరం పూర్తయిన సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కేక్ కట్ చేసారు.
ఎంపి శివనాధ్ మాట్లాడుతూ "సుపరిపాలన మొదలై ఏడాది" సందర్భంగా మొట్టమొదటిగా జనసేన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎన్డీఏ కూటమి లో ఎలాంటి సమస్యలు లేకుండా నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చేదోడుగా ఉన్న మంత్రి నారా లోకేష్ మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఎంపీ కేశినేని శివనాథ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సుపరిపాలనతో రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటుంది.. మరో 30 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించే విధంగా ఎన్డీఏ కూటమి ఐక్యమత్యంగా ఉంటుందని అయన అన్నారు.