YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పర్యాటక రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు కొత్త స్కెచ్

పర్యాటక రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు కొత్త స్కెచ్

కర్నూలు, జూన్ 5, 
ఆంధ్రప్రదేశ్‍లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీ కింద గుర్తించిన ప్రభుత్వం.. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. అలా హోమ్‌స్టే వంటి విధానాల ద్వారా పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందించి.. మరింత మంది సందర్శకులను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. మనదేశంలో గుజరాత్, తమిళనాడు తర్వాత అత్యంత పొడవైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాన్ని, అలాగే రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక కట్టడాలను మరింత అభివృద్ధి చేసి మరింతమంది పర్యాటకులను ఆకర్షించే ఆలోచనలో ప్రభుత్వం ఇంది.మరోవైపు ఏపీలో టూరిజం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరో కొత్త ఆలోచన చేసినట్లు సమాచారం. మంగళవారం అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో దీనిపై చర్చించినట్లు తెలిసింది. ఏజెన్సీ ప్రాంతాలలో హెలిపోర్టులు ఏర్పాటు చేసి.. గిరిజన ప్రాంతాల్లోనూ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనను చంద్రబాబు అధికారుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. విశాఖపట్నం, పాడేరు, అరకు, లంబసింగి వంటి ఏజెన్సీ ప్రాంతాలను పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అలాంటి ప్రాంతాల్లో హెలిపోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా సందర్శకులను మరింతగా ఆకర్షించవచ్చనేది ప్రభుత్వం ఆలోచన.హెలిపోర్టు.. అంటే హెలికాప్టర్లు దిగడానికి అనువుగా ఓ ప్రదేశాన్ని తయారు చేయటం.. ఒకటి కంటే ఎక్కువ హెలిప్యాడ్లను ఒకేచోట ఏర్పాటు చేస్తే దాన్నే హెలిపోర్ట్ అని పిలుస్తుంటారు. హెలికాప్టర్ల టేకాఫ్, ల్యాండింగ్, పార్కింగ్ కోసం హెలిపోర్టులు ఏర్పాటు చేస్తారు. అయితే హెలిపోర్టుల ఏర్పాటులో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రమాణాలు పాటించడం తప్పనిసరి. హెలిపోర్టుల వద్ద ఇంధనం, హ్యాంగర్స్ వంటి కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. హెలిపోర్టులను ప్యాసింజర్ల ప్రయాణానికి అలాగే అత్యవసర సేవల కోసం సాధారణంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలో ఇలాంటి హెలిపోర్టుల ద్వారా సందర్శకులు ఏజెన్సీ ప్రాంతాలను సులువుగా చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతాలలో హెలిపోర్టుల ఏర్పాటుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

Related Posts