
విజయవాడ, జూన్ 5,
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు, మాజీ మంత్రి పేర్ని నాని, కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కొందరు ముందస్తు బెయిల్ పొందారు. ముందస్తు బెయిల్ దక్కని వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. జరుగుతున్న పరిణామాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు జూన్ భయం పట్టుకుందా? ఈ నెలలో కీలక అరెస్టులు ఉంటాయని తెలుస్తోందా? పక్కా ఆధారాల సేకరణలో కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందా? కీలక నేతల అరెస్టులు ఉంటాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ప్రస్తుతం వల్లభనేని వంశీ మోహన్, కాకాని గోవర్ధన్ రెడ్డి, నందిగాం సురేష్ వంటి నేతలు జైల్లోనే గడుపుతున్నారు. ఇప్పట్లో వారికి బెయిల్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు జూన్ నెలలో మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక అరెస్టులు ఉంటాయని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు, మాజీ మంత్రి పేర్ని నాని, కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కొందరు ముందస్తు బెయిల్ పొందారు. ముందస్తు బెయిల్ దక్కని వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. జరుగుతున్న పరిణామాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.ముఖ్యంగా మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో సూత్రధారిగా పరిగణిస్తున్న రాజ్ కసిరెడ్డి, ఆయన అనుచరుడు అరెస్టయ్యారు. అటు తరువాత వైసిపి హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, జగన్ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కూడా అరెస్టు కాబడ్డారు. ఇంకోవైపు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి అరెస్టు కాకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందారు. అయితే జూన్లో మద్యం కుంభకోణానికి ఎండ్ కార్డు పడుతుందని.. కీలక నేతతో పాటు ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.అయితే నెల్లూరు జిల్లాలమైనింగ్ అక్రమాలకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టయ్యారు. అయితే ఆయన చాలా రోజులపాటు అజ్ఞాతంలో ఉండేవారు. న్యాయస్థానాల్లో ముందస్తు బెయిల్ దక్కకపోవడంతో ఆయన ఇతర రాష్ట్రాల్లో గడిపే వారన్న ప్రచారం ఉంది. ఈ తరుణంలో కేరళలో ఉన్న గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇంకోవైపు మాజీ మంత్రి కొడాలి నాని కి లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. విదేశాలకు పారిపోకుండా అన్ని ఎయిర్పోర్టులకు, పోర్టులకు కేంద్ర హోం శాఖ లుక్ అవుట్ నోటీసులు జారీచేసింది. ఆయన అరెస్టు ఖాయమని ప్రచారం జరుగుతోంది. పల్నాడు జిల్లాలో జంట హత్యలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి సోదరుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తూ కేసు నమోదు చేశారు. వారి అరెస్టు ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు బియ్యం మాఫియాకు సంబంధించిన కేసులో మాజీమంత్రి పేర్ని నాని చుట్టూ కూడా పుచ్చు బిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ అరెస్టులు, కేసుల నమోదు విషయంలో కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలను ఆశ్రయించే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వారి అరాచకాలను ఆధారాలతో సహా న్యాయస్థానాలు ముందు ఉంచాలని కూడా కసరత్తు చేస్తోంది. తద్వారా వారు నిజంగా తప్పు చేశారని.. తాము ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగలేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికైతే వైసీపీ నేతలకు జూన్ గండం అయితే మాత్రం ఉందని తెలుస్తోంది. మరి ఎంతమంది అరెస్ట్ అవుతారో చూడాలి.