
హైదరాబాద్, జూన్ 5,
విజయనగరం బాంబు పేలళ్ల కుట్ర కేసులో మరికొన్ని పేర్లు బయటకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటలిజెన్స్ తో పాటు ఎన్ఐఏ అధికారుల విచారణలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. విజయనగరంతో పాటు హైదరాబాద్, వరంగల్, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో బాంబ్ బ్లాస్ట్ లు చేయడానికి ప్లాన్ వేసిన సిరాజ్ గ్యాంగ్ కు పేలుడు పదార్థాల కొనుగోలుకు సంబంధించిన నిధులు ఇమ్రాన్ అక్రమ్ పంపినట్లు తేలింది. ఇమ్రాన్ అక్రమద్ హైదరాబాద్. అయితే ఇమ్రాన్ సౌదీలో సెటిలయ్యాడు. సిరాజ్ ఏర్పాటు చేసిన అహీం గ్రూపునకు సంబందించి ఆకర్షితుడైన ఇమ్రాన్ ఎంత డబ్బులు అయినా పేలుడు సామగ్రి కొనుగోలుకు పంపుతానని సిరాజ్ తో చెప్పినట్లు తేలింది. ఇమ్రాన్ అక్రమ్ సిరాజ్ కు సౌదీ లో ఉండి ఆర్థిక సహాకారం అందించగా, వరంగల్ కు చెందిన ఫర్హన్ మొహియుద్దీన్ తో పాటు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బదర్ తో పాటు మరికొందరు సిరాజ్ గ్యాంగ్ లో యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. గత ఏడాది చివరలో ముంబయి, ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీకి వెళ్లిన సిరాజ్ పలువురిని కలిశారు.అద్నార్ ఖురేషీ, దిల్షన్, మోషిన్ షేక్, జస్సీర్, షమద్, అమీర్ అన్సారీలో సిరాజ్ భేటీ అయి మాట్లాడినట్లు కౌంటర్ఇం లిజెన్స్ అధికారులు, ఎన్ఐఏ అధికారులు తేల్చారు. వారితో సిరాజ్ ఏం మాట్లాడారు? వారిని సిరాజ్ ఎలా ఉపయోగించుకోవాలనుకున్నాడు? అన్న దానిపైనే ప్రస్తుతం అధికారులు దర్యాప్తు కొనసాగుతుంది సిరాజ్, సమీర్ ల కదలికలను ముందుగా గుర్తించడంతో బాంబుపేలుళ్ల కుట్ర భగ్నమయింది. ఈ ఇద్దరికి అన్ని రకాలుగా సహకారం అందించిన వారిపైనే ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇంకా ఎవరెవరి ఖాతాలో నిధులు ఏమైనాజమ అయ్యాయా? సిరాజ్ తో పాటు ఇంకా ఎవరైనా పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారా? అన్న కోణంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం పోలీసులు నమోదు చేసిన ఈ కేసును ఎన్ఐఏ అధికారులు తీసుకుని దేశ వ్యాప్తంగా సిరాజ్ నెట్ వర్క్ ను ఛేదించాలన్న భావనలో ఉన్నారు. విదేశీ హ్యండర్లను గుర్తించడంతో పాటు దేశంలోని పలు ప్రాంతంలో ఉన్న స్లీపర్ సెల్స్ ను తమ కస్టడీలోకి తీసుకోవడం ద్వారా మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముందని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు