
బెంగళూరు
తొక్కిసలాట ఘటనపై సుమోటోగా కేసు, ఆర్సీబీ విజయోత్సవంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ కేసుపై కోర్టు విచారించనుంది. కాగా, బుధవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు.