YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏడాదిలో పూలెన్ని... రాళ్లెన్ని..

ఏడాదిలో పూలెన్ని... రాళ్లెన్ని..

విజయవాడ, జూన్ 6, 
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది అయింది న కనీ వినీ ఎరుగని మెజారిటీతో కూటమి అధికారం లోకి వచ్చింది.మొదటినుంచి చంద్రబాబు తీరు తెలిసిన వాళ్ళకి  ఈసారి ఆయనలో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. ఆయన తన మొఖంలోని ఫీలింగ్స్ కనిపించకుండా రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఈసారి ఆయన వీలైనంత ఎక్కువగా నవ్వుతున్నారు. ఏమాత్రం అవకాశం దొరికినా సామాన్యులతో కలిసి పోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రధానంగా ఆయనలో కనిపిస్తున్న మార్పు. తను బయటికి వస్తుంటే వీలైనంత తక్కువగా ఆర్భాటం ఉండేలా  జాగ్రత్త పడుతున్నారు. ప్రజలకు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు తనవల్ల కలగకూడదనే తాపత్రయం అడుగడుగునా కనిపిస్తుంది. అందుకే ఈసారి మహానాడు కూడా  కడప నగరంలో జరిపినా వేదికను ట్రాఫిక్ కి  ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. ఈ విషయంలో చంద్రబాబుకి ప్రజల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి.టిడిపి రాజకీయ మొత్తం ప్రస్తుతం లోకేష్ చుట్టూనే నడుస్తుంది. ప్రభుత్వ పరంగానూ చిన్న బాస్ మాటే శిరధార్యం గా మారింది. అటు పార్టీ పైనా ఇటు పవర్ లోనూ లోకేష్ మరియు ఆయన టీం పూర్తిస్థాయిలో పట్టు బిగించింది. చంద్రబాబు సైతం భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఢిల్లీలోని బిజెపి నాయకత్వం దాన్ని గుర్తించింది. లోకేష్ మంగళగిరిలో జరుపుతున్న ప్రజా దర్బార్ సక్సెస్ సాధించటంతో ఆయన జిల్లాల పర్యటనలోనూ దాని కంటిన్యూ చేస్తున్నారు. 2014 -19 మధ్య లోకేష్ ను ప్రధానంగా పారిశ్రామిక వర్గాలే కలుస్తూ ఉండేవి. ఈసారి సామాన్య ప్రజల్ని కలవడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యర్థులు కూడా  చంద్రబాబు కంటే ఎక్కువగా లోకేష్ ను టార్గెట్ చేస్తున్నారంటే లోకేష్ పవర్ సెంటర్ గా ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతుంది. అలాగే స్టూడెంట్స్ తో వీలైనంత ఎక్కువగా ఆయన మమేకం అవడానికి చూస్తున్నారు. విద్యా వ్యవస్థలో వీలైనంత మార్పులు తేవడానికి ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తన ప్రాధాన్యత చూపిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధి చేయడం వంటివి, అటవీ శాఖలో  కుంకీ ఏనుగుల ను ప్రత్యేకంగా రప్పించడం వంటి కార్యక్రమాలతో మంచి పేరే తెచ్చుకుంటున్నారు. అయితే పొలిటికల్ గా మాత్రం ఆయన  ఈ ఏడాదిలో తన స్టాండ్ మార్చుకున్నారు. పూర్తిస్థాయిలో సనాతన ధర్మం ఏజెండా గా కష్టపడుతున్నారు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లోనూ తన ప్రభావం చూపించడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. మరో 15 ఏళ్లు కూటములోనే కొనసాగుతామని ఆయన స్పష్టత ఇచ్చేయడంతో  ఆయన ఓకే అంటే జనసేనలో చేరడానికి చాలామంది రెడీగా ఉన్నారు. కానీ విషయంలో జనసేన ఆచితూచి వ్యవహరిస్తుంది. కేంద్రంలో కూటమి కీలకం గా మారడంతో అమరావతికి తగినన్ని ఫండ్స్ బానే తెచ్చుకుంటున్నారు. గత ఐదేళ్లు పాడుబడిన అడవిలా మారిన అమరావతి కి కొత్త కళ వచ్చింది. అమరావతి పనులను ఏజెన్సీలకు టెండర్లు ఇచ్చేంతవరకకూ ఏడాదిలో పనులు జరిగాయి. జరగాల్సింది చాలానే ఉంది.ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఐదేళ్లలో పోలవరం పూర్తి చేయాలని కష్టపడుతుంది కూటమి ప్రభుత్వం. ప్రజలు కూడా ఒక విధంగా చెప్పాలంటే కూటమి కి డెడ్లైన్ విధించినట్టే. దాంట్లో ఒక ఏడాది పూర్తయిపోవడంతో ఇంక నాలుగేళ్లు మాత్రమే సమయం మిగిలి ఉంది. పోలవరం పూర్తి చేయడంతో పాటుగా  బనక చర్ల తో అనుసంధానం చేయాలని కొత్త ప్రాజెక్ట్ ని చంద్రబాబు అనౌన్స్ చేశారు. అది పూర్తయితే రాయలసీమ కూడా సస్య శ్యామలం అయినట్టే గత వైసిపి ప్రభుత్వం దెబ్బ తినడానికి అతిపెద్ద కారణం రోడ్లు. ఆ పరిస్థితి అర్థం చేసుకున్న కూటమి అధికారం లోకి వచ్చీ రాగానే రోడ్లపై పడ్డారు. ప్రస్తుతం ఏపీలో రోడ్లు ఓ దారి కయితే వచ్చాయి.
ఈ ఒక్క యాడదలోనే ఏపీకి 9 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను తెచ్చే ప్రయత్నం చేసామన్నారు కూటమి మంత్రి టీజీ భరత్. అలాగే అమరావతిలో క్వాంటం వ్యాలి ప్రాజక్ట్ ను భవిష్యత్తు గేమ్ చేంజర్ గా చెబుతున్నారు సీయం చంద్రబాబు. అలాగే అమరావతి వైజాగ్ మెట్రో లకు సంబంధించి  కొన్ని కీలక నిర్ణయాలను త్వరలోనే అమలులో పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. గత ఐదేళ్లు ప్రజలకు లేని స్వేచ్ఛను  మేము ఇచ్చాము అంటున్నారు కూటమి నేతలు. స్వయంగా సీఎం చంద్రబాబు సహా  ప్రభుత్వంలో ఉన్న  నేతలందరూ ఇదే మాట చెబుతూ వస్తారు  చెబుతూ వస్తున్నారు. ప్రజలపై వేధింపులు తమ పాలన తో తగ్గించామని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఓమేర గ్రామీణ ప్రజల్లో కూడా ఈ భావం ఉంది.ఇక ఈ ఏడాది పాదంలో కుటుంబ ప్రభుత్వం పై వెలుపడుతున్న విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అభివృద్ధి కంటే తమను హింసించిన వైసీపీ నేతలు పైనే రివెంజ్ తీసుకునే పనిలో పడ్డారని విమర్శలు ప్రతిపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెడ్ బుక్కు రాజ్యాంగం అంటూ వారు చేస్తున్న ప్రచారం కొంతమేర ప్రభావం చూపుతోంది. అయితే ప్రజలు దీనిపై అంత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వారి దృష్టి అంతా డెవలప్మెంట్ మీదే ఉంది. వాలంటీర్లు వ్యవస్థను తొలగించిన తర్వాత దాన్ని డీల్ చేసిన విధానం సరిగా లేదనే. అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లు విధానాన్ని కొనసాగిస్తామని చెప్పినా పవర్ లోకి వచ్చాక మాత్రం మంగళం పాడేసారు.తిరుపతిలో ఆవు నెయ్యి కల్తీ జరిగినట్టు కూటమి చేసిన ప్రహసనం   పెద్దగా వర్కౌట్ కాలేదు.  మరోవైపు రాజకీయంగా ఎలాంటి అవకాశం వచ్చినా దాన్ని బిజెపి తీసుకుపోవడం టిడిపి నేతలకు పార్టీ పరంగా అసహనం కలిగిస్తుంది. అలాగని ఏపీకి బిజెపి నుంచి ఇబ్బడి ముబ్బడి గా సహాయమూ లభించడం లేదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అలాగే కరెంటు బిల్లులు పెరిగిపోవడం ఆ నెపానన్ని గత వైసిపి పై వేయడం కూటమికి  ఇబ్బంది కలిగించే అంశమే. అలాగే గంజాయి నేరాలు కూటమి పాలన లో కూడా తగ్గలేదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. సూపర్ సిక్స్ అమలులో జరుగుతున్న జాప్యం కూడా కూటమి నేతలను ఇబ్బంది పాలు చేస్తోంది. ముఖ్యంగా తల్లికి వందనం, మహిళలకు ఫ్రీ బస్సు పథకాల అమలు కోసం జనం ఎదురుచూస్తున్నారు.  ప్రతిపక్ష వైసిపి చేస్తున్న అతిపెద్ద తప్పు అసెంబ్లీకి వెళ్లకపోవడం అనేది  రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మొత్తం రాష్ట్ర ప్రజల దృష్టిలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని చేజేతులా వదులుకుంటుంది వైసిపి చాలామంది భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వ విధానాల లోని తప్పిదాలను  సమర్థవంతంగా తిప్పుకొట్టడంలో ఎక్కడో లోపం జరుగుతుంది అని విపక్ష పార్టీ కార్యకర్తలే అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి  ఎక్కువగానే బెంగళూరులో ఉంటున్నారు అన్న ప్రచారాన్ని కూటమి ప్రజల్లో బాగా ప్రచారం చేసింది. ఆయన అందుబాటులో ఉండరనే అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంది. నిజానికి రాజకీయాల్లో ఈ పరిస్థితి రివర్స్లో ఉండాలి. ఇలా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న కొన్ని తప్పిదాలు కూటమికి కలసివస్తున్నాయి.

Related Posts