
శంషాబాద్
మాజీ ఐపిఎస్ ప్రభాకర్ రావు బౌన్సర్లు శంషాబాద్ ఎయిర్పోర్టులో మీడియాపై దాడికి పాల్పడ్డారు. ప్రభాకర్ రావు ఎయిర్పోర్ట్ నుండి బయటికి వచ్చే సమయంలో 50 మంది తన అనుచరులు వచ్చారు. 15 మంది బౌన్సర్లను పెట్టుకొని మీడియా వారిపై దాడికి పాల్పడ్డారు. ఇమిగ్రేషన్ కార్యాలయంలోనే మూడు గంటలపాటు ప్రభాకర్ రావు వివరాలు అధికారులు తీసుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి బయటికి వచ్చే సమయంలో ప్రభాకర్ రావును మాట్లాడించే ప్రయత్నం మీడియా చేసింది. అదే సమయంలో ప్రభాకర్ రావు వెంట ఉన్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులను నెట్టివేసి దాడికి పాల్పడ్డారు..