
హైదరాబాద్, జూన్ 9,
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను పార్టీ నాయకత్వం బుజ్జగించే కార్యక్రమాన్ని చేపట్టింది. మంత్రి వర్గ విస్తరణలో పదవులు రాని వారి ఇళ్లకు వెళ్లి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంటికి పీసీసీచీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్రవ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ లు చేరుకున్నారు. ఈ దఫా విస్తరణలో సుదర్శన్ రెడ్డికి చోటు దక్కలేదు. సుదర్శన్ రెడ్డి ఇంటికి... దీంతో ఆయనను బుజ్జగించేందుకు సుదర్శన్ రెడ్డి ఇంటికి చేరుకుని నేతలు బుజ్జగిస్తున్నారు. విస్తరణలో తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని సుదర్శన్ రెడ్డి కోరుతున్నారు. పార్టీలో సీనియారిటీతో పాటు సిన్సియారిటీ, నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో తనకు అవకాశం కల్పించాలన్నసుదర్శన్ రెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకోలేదు. రెడ్డి సామాజికవర్గానికే ఈ విస్తరణలో చోటు దక్కలేదు. దీంతో ఆయనకు నచ్చ చెప్పేందుకు అగ్రనేతలు సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కూడా వీరిద్దరూ భేటీ కానున్నారని తెలిసింది
మూడు సామాజిక వర్గాలకు..
మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ముగ్గురికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ముగ్గురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇద్దరు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారికి, ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు మంత్రివర్గంలో చోటు దక్కింది. వీరిలో గడ్డం వివేక్ మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా, అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సామాజికవర్గానికి చెందిన వారు. ఇక వెనకబడిన తరగతులకు చెందిన అడ్లూరి లక్ష్మణ్ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కొత్త మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. గడ్డం వివేక్ ఇంగ్లీష్ లోనూ, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.