YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

త్వరలో టన్నెల్ పనులు

త్వరలో టన్నెల్ పనులు

మహబూబ్ నగర్, జూన్ 9, 
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదం సంభవించి దాదాపు నాలుగు నెలలు కావస్తుంది. అయితే రెస్క్యూ ఆపరేషన్ ను ప్రభుత్వం నిలిపి వేసింది. శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కు బ్రేక్ పడింది.మరో మూడు నెలల వరకూ ప్రమాదం జరిగిన ప్రాంతంలో తవ్వకాలు జరిపే అవకాశం లేదని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు కనీసం మృతదేహాలను కూడా అప్పగించలేని పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదం వంద రోజులు దాటిపోయింది. శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదం లో రెస్క్యూ ఆపరేషన్ కు తాత్కాలిక బ్రేక్ అని చెప్పినప్పటికీ ఇక కొనసాగించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.మొత్తం ఎనిమిది మంది కార్మికులు శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో చనిపోగా అందులో ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మరో ఆరుగురి మృతదేహాలు లభ్యం సాధ్యం కాలేదు. ప్రమాదకరమైన ప్రాంతంలో మృతదేహాలుంటాయని గుర్తించినప్పటికీ అక్కడకు సహాయక బృందాలకు వెళ్లలేక చేతులెత్తేశాయి. దాదాపు మూడు నెలల పాటు నిర్విరామంగా పనిచేసిన సహాయక బృందాలు ఆ తర్వాత తమ వల్ల కాదని చెప్పేశాయి. అందులో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఇక మృతదేహాల గాలింపు సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాదంలో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారి శివశంకర్ ను నియమించినా ఆయన ఇచ్చిన నివేదిక కూడా అలాగే ఉంది.. ప్రమాదం జరిగిన డీ2 ప్రాంతంలో తవ్వకాలు జరిపితే పై కప్పు మళ్లీ కూలుతుందని అధికారులు చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ప్రమాదకరమైన జోన్ లో తవ్వకాలు జరపడం మంచిది కాదని, సేఫ్ కూడా కాదని, కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరికలతో నెలరోజులకు పైగానే అక్కడ సహాయక చర్యలు కొనసాగడం లేదు.దీంతో మృతదేహాలను మాత్రం కుటుంబీకులకు అప్పగించలేకపోయారు. కేవలం ఇద్దరిని మాత్రమే అప్పగించారు. అయితే ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన మరోసారి చర్చనీయాంశమైంది. మరోసారి శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ పనులు ప్రారంభిస్తామని, ఈ ఏడాది శాసనసభ సమావేశాల్లోపు వాటిని పూర్తి చేస్తామని, అందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని చెప్పడంతో మృతదేహాలను వెలికి తీయడంలో బ్రేక్ ఇచ్చిన ప్రభుత్వం మరోసారి ప్రారంభిస్తుందా? లేక టన్నెల్ పనులను అలాగే మొదలు పెడుతుందా? అన్నది తేలాల్సి ఉంది

Related Posts