
హైదరాబాద్
మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం నాడు కాళేశ్వరం కమిషన్ ముందు హజరయ్యారు. అంతకుముందు హరీష్ రావు మాట్లాడుతూ న్యాయవ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద మాకు అపారమైన నమ్మకం బి ఆర్ ఎస్ పార్టీకి ఉంది. అందుకే కమిషన్ ముందు హాజరు అవుతున్నాం. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని అన్నారు.
ప్రభుత్వం విద్వేషంతో ఆలోచన చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నది. రాజకీయాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాల రాయద్దు. అంతిమంగా న్యాయం గెలుస్తది. న్యాయం మీద నమ్మకం ఉంది, దైవం మీద నమ్మకం ఉంది. మేము ప్రభుత్వం లో లేము, అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తామని అన్నారు.
హరీష్ రావు వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లె రాజేశ్వర్ రెడ్డి, సంజయ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులున్నారు.