YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆరోగ్య సమస్యలు లేవు

ఆరోగ్య సమస్యలు లేవు

కాకినాడ
ప్రజలకు ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాసారు. ఈ మద్య మాకుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు.  ఆ కుటుంబానికి, మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్దలు వచ్చాయి. ..ఒక సంవత్సరము నుండి పూర్తిగా అన్ని రకాల రాకపోకలు బంద్  అయ్యాయి. వారి జోలికి నేను వెళ్ళడం లేదు, అయినా మమ్ములను టార్గెట్ చేస్తున్నారు. కారణం మా చిన్నాబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగలిపోతున్నారు. నాకు కేన్సర్ వచ్చిందని ఇంట్లో బంధించి చిన్న కొడుకు, వారి మామ  పట్టించుకోవడం లేదని బాధాకరమైన మాటలు అంటున్నారు. ఈ రోజు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్నకొడుకే 100-1000 శాతం కారణం అని చెబుతున్నాను. రోజు అన్ని సేవలు నాకు చేయకుండా గిరి బయటకు వెళ్లడు. గతంలో నా భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు హైద్రాబాద్ హాస్పటల్లో ఆపరేషన్ చేయించుకుని సుమారు 15 రోజులు తరువాత హాస్పటల్ నుండి విశ్రాంతి కోసం మీ ఇంటికి వస్తే ఇంటి నుండి బయటికి పంపిన సంగతి మీ ఇరువురూ మర్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మీ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. నాకు వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవు. నేను పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నాను మరియు నిత్యం నా ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నాను.  నన్ను బంధించి ఉంచడం కాని, మానసికంగా హింసించడం కాని ఎవ్వరి తరం కాదని తెలియజేస్తున్నానని పేర్కోన్నారు.
ప్రభుత్వ జీ.వోలపై ఆ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారు. మీకు అంత దమ్ము ఉంటే కాపు రిజర్వేషన్ మరియు ముఖ్యమంత్రి ఎన్నికలలో ఇచ్చిన హామీలను, సూపర్ సిక్స్ పధకాలును అమలు చేయించి మీ డబ్బా కొట్టుకోండి.  నిజంగా అదే నిజమైతే రాష్ట్ర ముఖ్యమంత్రిని, లోకేష్ బాబుని, మరియు ఉప ముఖ్యమంత్రిని చూసి జాలి పడుతున్నానని అన్నారు.

Related Posts