YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

2.99 లక్షల కోట్లతో అమృత్ 2 అమలు చేస్తున్నాం

2.99 లక్షల కోట్లతో అమృత్ 2 అమలు చేస్తున్నాం

కరీంనగర్
అమృత్ 1 అమృత్ 2 కింద తెలంగాణలో మొత్తం 6 వేల 876 కోట్లు ఖర్చు చేస్తున్నాం
ఇంటింటికీ నీళ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడమే లక్ష్యం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి.
చొప్పదండిలో రూ.36.3 కోట్ల వ్యయంతో, వాటర్ ఇంప్రూవ్ మెంట్, స్కీంకు కేంద్ర మంత్రి శంకుస్థాపన.
స్థానిక ఎమ్మెల్యేతో కలిసి భూమిపూజ చేసిన బండి సంజయ్..
అమృత్ 2 పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణాల్లో నివసించే వారికి నీళ్లను అందించేందుకు రూ.2 లక్షల 99 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. ఇందులో కేంద్ర వాటా కింద 76 వేల 760 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు, నగర పాలక సంస్థలు సమీకరించుకుంటున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగా అమృత్ 1, అమృత్ 2.0 కింద తెలంగాణలో మొత్తం 6 వేల 876 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
చొప్పదండి పట్టణంలోని నల్లాలబావి వద్ద స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తో కలిసి రూ.36.3 కోట్ల వ్యయంతో ‘వాటర్ ఇంప్రూవ్ మెంట్, స్కీంకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా భూమి పూజ చేశారు. శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే:
చొప్పదండి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికీ సరిపడ నీళ్లను అందించాలనే లక్ష్యంతో  అమృత్ 2 పథకం కింద 36 కోట్ల 30 లక్షల రూపాయల నిధులతో పైప్ లైన్, వాటర్ సంప్ ఇతర పనులను చేపట్టేందుకు ఈరోజు నల్లాల బావివద్ద స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యేతో కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉంది.
2015 జూన్ 25న ప్రారంభమైన అమృత్ 1 పథకం కింద 2015-16 నుండి 2019-20 వరకు, కేంద్ర ప్రభుత్వం తన వాటాకింద ఖర్చు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అమ్రుత్ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1 కోటి 34 లక్షల నీటి కనెక్షన్‌లు అందించగలిగినం. 1 కోటి 2 లక్షల మురుగునీటి కనెక్షన్‌లు అందించాం. వీటితోపాటు 2 వేల 411 పార్కులను అభివృద్ధి చేసుకోగలిగినం. 62 లక్షల 78 వేల  ఎల్ఈడీ లైట్లను మార్చుకోగలిగినం.
అట్లాగే 2021లో అమృత్ 2.0  పథకం ప్రారంభమైంది. ఐదేళ్లపాటు ఈ పథకం అమలులో ఉంటుంది. ఈ స్కీం కింద కేంద్ర, రాష్ట్రాలు, మున్సిపాలిటీల భాగస్వామ్యంతో ఈసారి 2 లక్షల 99 వేల కోట్ల రూపాయల ఖర్చు చేయాలని నరేంద్రమోదీ  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో కేంద్ర వాటా కింద 76 వేల 760 కోట్ల రూపాయలను కేటాయించబోతున్నం. మిగిలిన మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు, నగర పాలక సంస్థలు సమీకరించుకోవాల్సి ఉంది.
మన రాష్ట్రం విషయానికొస్తే అమృత్ 1, అమృత్ 2.0 కింద మొత్తం 6 వేల 876 కోట్లు ఖర్చు చేయబోతున్నం. ఇందులో కేంద్ర వాటా 3 వేల 591 కోట్ల 72 లక్షల రూపాయలు.  రాష్ట్ర వాటా కింద 2 వేల 614 కోట్ల 82 లక్షల రూపాయలు. ఎంపిక చేయబడిన మున్సిపాలిటీల వాటా 669 కోట్ల 85 లక్షల రూపాయలు. అమృత్ 1 కింద 11 వందల 53 కోట్లు, అమృత్ 2 కింద 2వేల 438 కోట్ల రూపాయలను నరేంద్రమోదీ ప్రభుత్వం కేటాయించింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికొస్తే అమృత్ 1, అమృత్ 2 కింద మొత్తం 852 కోట్ల 11 లక్షల రూపాయలు కేటాయించినం. అందులో కేంద్ర వాటా 481 కోట్ల 19 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 297 కోట్ల 55 లక్షలు, మున్సిపాలిటీల వాటా 73 కోట్ల 37 లక్షలు. అందులో భాగంగానే చొప్పదండి మున్సిపాలిటీలో అమృత్ 2 కింద 36 కోట్ల 30 లక్షల రూపాయల నిధులతో ఇంటింటికీ నీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం 17 కోట్ల 89 లక్షలు, రాష్ట్రం వాటా 15 కోట్ల 11 లక్షలు, మున్సిపాలిటీ వాటా 3 కోట్ల 30 లక్షలు. ఈ పథకము ద్వారా నల్లాల బావివద్ద వాటర్ సంప్, 46.21 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ నిర్మాణంతోపాటు 1500 KL ELBR cum ELSR లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్కీం ద్వారా 2 వేల 800 నల్లా కనెక్షన్లకు నీటిని సరఫరా చేయబోతున్నాం.
నిజానికి మన దేశంలో 40 శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తోంది. 2047 నాటికి ఈ సంఖ్య  50 శాతం కంటే ఎక్కువ కాబోతోంది. పట్టణాల్లో నివసించే వారికి రోజుకు సగటున ప్రతి వ్యక్తికి 136 లీటర్ల నీళ్లు అవసరం. కానీ 60 నుండి 69 లీటర్ల నీరు మాత్రమే  అందుతోంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో దూరద్రుష్టితో  నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రతి ఇంటికీ సరిపడా నీటిని అందించంతోపాటు, డ్రైనేజీ సౌకర్యం కల్పించి నీటి భద్రతా నగరాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అమృత్ అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్, పథకాన్ని ప్రారంభించారు.
వాస్తవానికి చొప్పదండిలో ఎప్పుడో ఈ స్కీంను స్టార్ట్ చేయాల్సి ఉండే. గత ప్రభుత్వం సహకరించకపోవడంవల్ల ల్యాండ్ కేటాయించలేదు. లేకుంటే ఈ స్కీం ఇప్పటికే ప్రారంభమయ్యేది.  ఇయాళ అన్ని అడ్డంకులను అధిగమించి పథకం పనులకు శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ పనులను పూర్తి చేసి చొప్పదండి ప్రజలకు ఇంటింటికీ సరిపడా నీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
నేను ఎంపీగా ఉన్న సమయంలో స్మార్ట్ సిటీ, అమ్రుత్ నిధులు రావడం కరీంనగర్ పార్లమెంట్ ను అభివ్రుద్ధి చేసుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. దీంతోపాటు సీఆర్ఐఎఫ్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రోడ్లను నిర్మిస్తున్నాం. ఇవిగాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అనేక అభివ్రుద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.

Related Posts