
చిత్తూరు
పులిచెర్ల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. మూడు రోజుల నుంచి ఏనుగుల గుంపు తిష్టవేసింది. మామిడి చెట్లను ధ్వంసం చేసింది. మంగళవారం ఈరోజు వేకువ జామున కల్లూరు వద్ద బస్సును ఏనుగుల గుంపు అడ్డుకుంది. ఈ నేపధ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు.