
హైదరాబాద్
హైదరాబాద్ లో ఆషాడం లో జరిగే బోనాల ఉత్సవాలపై అధికారుల సమీక్ష జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆషాఢ జాతర బోనాల ఉత్సవాలు 2025 జరగనున్నాయి. ఈ అధికారుల సమన్వయ సమావేశానికి హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డిజిపి జితెందర్, సిపిసివి ఆనంద్, మంత్రి కొండా సురేఖ, , ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఎండోన్మెంట్, మూడు కమిషనరెట్ల సీపీ లు, డీసీపీ లు, పోలీస్ , ఎండోన్మెంట్ అన్ని విభాగాల అధికారులు హజరయ్యారు. ఈ ఈ నెల 26 నుంచి నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. గోల్కొండ బోనాలు ప్రారంభం మొదటి పూజ జూన్ 26, జూలై ఒకటో తేదీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, సికింద్రాబాద్ బోనాలు... (లష్కర్ బోనాలు) జూలై 13 వ తేదీ బోనాలు, జూలై 14 వ తేదీ రంగంవుంటాయి. # ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ్ బోనాలు జూలై 20 వ తేదీ బోనాలు, జూలై 21 రంగం జరుగుతాయి. బోనాల ఉత్సవాలకు 20 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేస్తున్నారు.