
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా రాజంపేట లో తెల్లవారుజాము నుంచే విచ్చల విడిగా మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతిరోజూ తెల్లవారుజామున టీ దుకాణాలతో పాటు అమ్మకాలు మొదలవుతున్నాయి. కొత్తబస్టాండ్ సమీపంలోని రఘు వైన్స్ లో మంగళ వారం తెల్లవారుజామున మద్యం షాప్ మూసి ఉన్నప్పటికి,పక్కనే ఉన్న పర్మిట్ రూముల్లో గోతాల్లో పెట్టి మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా నిర్వహిస్తు న్నారు. మద్యపాన ప్రియులు అక్కడే కొని అక్కడే కూర్చొని తాగుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలపై విమర్శలు వస్తున్నా ఎక్సైజ్ శాఖ పట్టించుకోక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.