YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దేశాన్ని ఏకతాటిపైకి హిందీ భాష తీసుకొస్తుంది

దేశాన్ని ఏకతాటిపైకి హిందీ భాష తీసుకొస్తుంది

హైదరాబాద్
హైదరాబాద్ నాంపల్లి లో హిందీ ప్రచార్ సభ హైదరాబాద్ 90వ వార్షికోత్సవ కార్యక్రమంలో  రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గోన్నారు.
గవర్నర్ మాట్లాడుతూ భారత దేశం విభిన్న భాషలు, సాంస్కృతిక,  సంప్రదాయాలకు నిలయం. వీటీనన్నింటిని హిందీ భాష ముందుకు తీసుకెళ్తుంది. దేశాన్ని ఐక్యం చేసేందుకు , భారతీయ వారసత్వాన్ని కాపాడేందుకు హిందీ దోహదపడుతుంది. దేశంలో అత్యధికంగా హిందీ భాషనే మాట్లాడుతారు. దేశాన్ని ఏకతాటిపైకి హిందీ భాష తీసుకొస్తుంది. హిందీ తో పాటు ప్రాచీనమైన భాషలను గౌరవించాలి. ఒకప్పుడు హిందీ ను ప్రజలకు చేరవేయడం కష్టంగా ఉండేది.. కానీ సామాజిక మాధ్యమాల ద్వారా అది సులభతరం అయింది. మేఘాలయ , త్రిపుర , నాగాలాండ్ , సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హింది బాగా మాట్లాడుతున్నారు. ఆదివాసుల కూడా హిందీ మాట్లాడుతున్నారు. 90 ఏళ్లుగా హిందీ ప్రచార సభ , హిందీ భాష అభివృద్ధి కోసం చేసిన సేవలు అభినందనీయం. ఎంతో కష్టపడి హిందీని ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Related Posts