
సిద్దిపేట
హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తూన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి సిద్దిపేట పొన్నాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ శాఖ ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేస్తా. అందరి ఆశీర్వాదంతో సామాన్యుడైన నాకు మంత్రి పదవి లభించింది. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల ప్రజలకు సోషల్ జస్టిస్ గా మంత్రి వర్గ విస్తరణ జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయని విధంగా అన్ని వర్గాల ను సమన్యాయం చేసేలా మంత్రి వర్గ విస్తరణ చేశారని అన్నారు. మేము చెప్పిందే చేస్తాం అదే కాంగ్రెస్ పార్టీ నినాదమన్నారు.