YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజీనామాలకు ఆమోదం ఎప్పుడు...

రాజీనామాలకు ఆమోదం ఎప్పుడు...

విజయవాడ, జూన్ 11, 
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కావస్తుంది. వైసీపీ అధికారం కోల్పోవడంతో అనేక మంది నేతలు పార్టీకి రాజీనామా చేశారు. అధికార పార్టీలోకి చేరిపోయేందుకు సిద్ధమవుతున్నారు. అందులో ప్రధానంగా ఎమ్మెల్సీలు చాలా మంది ఇప్పటికే వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే వారు గత కొంత కాలం నుంచి రాజీనామాలు ఆమోదించాలంటూ శాసనమండలి ఛైర్మన్ కు మొరపెట్టుకుంటున్నారు. అయితే ఇంత వరకూ రాజీనామాలు ఆమోదం పొందలేదు. మరొక వైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరేందుకు కూడా దారి రెడీ కాలేదు. రాజీనామా చేసిన వారిలో కొందరిని ఇంకా పార్టీలో చేర్చుకోలేదు. పోతుల సునీత ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆమె రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ ఆమోదించలేదు. అదే సమయంలో పోతుల సునీతను టీడీపీలో కూడా చేర్చుకోలేదు. పోతుల సునీతను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ సొంత పార్టీ నేతల నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నాడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్ పై విమర్శలు చేసిన పోతుల సునీతను పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సూటిగానే ప్రశ్నించారు. కేవలం శిరీష మాత్రమే కాదు టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి కూడా పెద్దయెత్తున విమర్శలు సోషల్ మీడియాలో కనపడటంతో ఆమెను పార్టీలోకి తీసుకోలేదు. ఒక కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, శానమండలి డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖానమ్ కూడా పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు. జకియా ఖానమ్ రాజీనామా కూడా ఇంత వరకూ శాసనమండలి ఛైర్మన్ ఆమోదం పొందలేదు. తిరుమలలో టిక్కెట్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొనడంతో జకియా ఖానమ్ ను టీడీపీ దూరం పెట్టింది. జనసేనలో చేరాలనుకున్నప్పటికీ అది కుదరలేదు. చివరకు జకియా ఖానమ్ బీజేపీలో చేరి కూటమి పార్టీలో కుదరుగా ఉండే ప్రయత్నం చేసింది. జకియా ఖానమ్ రాజీనామా ఆమోదం పొందితే అది బీజేపీకి దక్కే అవకాశముంది. ఎందుకంటే తమ పార్టీకి చెందిన నేత రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని తమకు ఇవ్వాలని కమలనాధులు పట్టు బట్టే అవకాశముంది. రాజీనామాలు ఆమోదం పొందక... ఇక మరో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. అధికారికంగా మాత్రం టీడీపీలో చేరలేదు. కానీ మర్రి రాజశేఖర్ రాజీనామాను కూడా ఆమోదించలేదు. వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, జయ మంగళ వెంకట రమణ, మర్రి రాజశేఖర్, జకియా ఖానంలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే వీరిలో ఎవరి రాజీనామాలు ఆమోదం పొందకపోవడంతో వీరు ఏ పార్టీలో ఉన్నారన్నది ఇంకా అర్థం కాకుండా ఉంది. మండలి ఛైర్మన్ వీరిని మరొకసారి విచారించి రాజీనామాలు ఆమోదిస్తారని చెబుతున్నా ఏడాది కాలం పూర్తి అవుతున్నా కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న కూటమి పార్టీలకు కుదరడం లేదు. రాజీనామాలు ఆమోదం పొందితే వీరి స్థానంలో కొత్త వారికి అవకాశాలు వస్తాయి. అందుకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ రాజీనామాలు మాత్రం ఆమోదం పొందడం లేదు.

Related Posts