
గోదావరిఖని
గోదావరిఖని లోని ప్రైవేట్ పాఠశాలలో శ్రీకృష్ణ లీలలు లాగా ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా తమ పాఠశాలలోనే పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, శూలు, టై, దీనితోపాటు స్పోర్ట్స్ కు సంబంధించిన డ్రెస్ కూడా కొనాలంటూ తల్లిదండ్రులపై ఆంక్షలు విధిస్తున్నారు.
ఇష్టానుసారంగా ఫీజులు వసూలు.
ప్రైవేట్ పాఠశాలలో తరగతితో సంబంధం ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు ఇష్టం వచ్చిన రీతిగా ఫీజులు నిర్ణయించి తల్లిదండ్రులపై భారం పెడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక లబోదిబో అంటున్నారు.
పట్టించుకోని సంబంధిత అధికారులు.
ప్రైవేటు పాఠశాలలో ఇంత జరుగుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడని సంబంధిత అధికారులు. జూన్ మాసం వచ్చిందంటే ప్రైవేట్ పాఠశాలలు ప్రతి ఏటా ఫీజులు పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఫీజుల విషయంలో పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
బస్సు చార్జీలు సపరేట్.
దూరపాంత విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి మళ్లీ ఇంటి దగ్గర దించడానికి ఫీజు తో సంబంధం లేకుండా బస్సు ఫీజు సపరేట్ అంటూ తల్లిదండ్రుల దగ్గర బస్సు ఫీజు వసూలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ పెరిగాయి అంటూ బస్సు ఫీజు అధికంగా వసూలు చేస్తున్నారు. పాఠశాల బస్సులు కండిషన్ లో ఉన్నాయో లేవో ఆర్టీవో తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాల బస్సులు అనేకమార్లు ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా.
నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో ప్రత్యేక బుక్ స్టాల్ కౌంటర్ ను ఏర్పాటు చేసి అధిక ధరలకు విద్యార్థులకు పుస్తకాలు అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు.
పాఠశాలలలో కనీస సౌకర్యాలు కరువు.
ప్రవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేసిన విద్యార్థులు కనీస సౌకర్యాలు కూడా లేవంటున్నారు. తాగడానికి మంచి నీళ్లు లేకపోవడమే కాకుండా, బాత్రూంలో శుభ్రంగా లేకపోవడం, భోజనం చేయడానికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటున్నారు తల్లిదండ్రులు అంటున్నారు అంతేకాకుండా పిల్లల సైకిల్ పార్కింగ్ షెడ్డు లేకపోవడంతో ఎండకు, వానకు సైకిళ్లు ఖరాబ్ అయితున్నాయని అంటున్నారు. అంతేకాకుండా రోడ్ల పైన పార్కింగ్ చేయడం జరుగుతుందని. ఎన్నోసార్లు సైకిల్ పోయిన సంఘటన కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యజమాన్యాలు అధిక ఫీజులు తీసుకున్న కూడా విద్యార్థులకు పాఠశాల లొ కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరంగా ఉందని తల్లిదండ్రులు అంటున్నారు.
ప్రైవేటు పాఠశాలలపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు అధిక ఫీజుల పైన, పుస్తకాల పైన, బస్సు చార్జీలు, పై ప్రైవేట్ పాఠశాల యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.