
అనంతపురం
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి వద్ద రైలులో దోపిడీ జరిగింది. ముంబయి నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్ పట్టు ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగలు హల్ చల్ చేసారు. ఎస్1, ఎస్2 బోగీల్లో ప్రయాణికుల నుంచి దోచుకున్నారు. కోమలి వద్ద సిగ్నల్ వైర్లు కత్తిరించడంతో ఎక్స్ ప్రెస్ రైలు నిలిచింది. సిగ్నల్ చూపకపోవడంతో నిలిచిన రైలు బోగీల్లోకి దొంగలు చొరబడిన ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసిరు. అందినకాడికి దోచుకున్నారు.