
హైదరాబాద్, జూన్ 24,
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికలు అత్యంత చురుకుగా, ఉత్సాహభరితంగా కనిపించాయి.ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. డిజిటల్ యుగంలో పార్టీల గెలుపు ఓటములు, పథకాల అమలు, ఇతర అంశాలన్నీ సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు చేరుతున్నాయి. దీంతో నేతల పనితీరుకు సోషల్ మీడియా కొలమానంగా మారింది. 2023 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు, బీఆర్ఎస్ ఓటమికి సోషల్ మీడియా కీలక పాత్ర పోసించింది. అయితే ఇప్పుడు అధికార కాంగ్రెస్ సోషల్ మీడియా బలహీనపడింది.2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికలు అత్యంత చురుకుగా, ఉత్సాహభరితంగా కనిపించాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, కాంగ్రెస్ సోషల్ మీడియా బృందాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు, ప్రజల సమస్యలను హైలైట్ చేయడం, పార్టీ హామీలను ప్రచారం చేయడంలో నిరంతరం కృషి చేశాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, సోషల్ మీడియా వారియర్స్ నిమిషం నిమిషం కొత్త వ్యూహాలతో ప్రత్యర్థి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పై దాడి చేశారు. ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్), ఫేస్బుక్, వాట్సాప్ వంటి ప్లాట్ఫారమ్లలో వీడియోలు, మీమ్స్, గ్రాఫిక్స్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకున్నారు. ఈ కాలంలో, సోషల్ మీడియా యాక్టివిస్టులు పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి, ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించారు.2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, సోషల్ మీడియా వేదికల ఉత్సాహంలో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత, సోషల్ మీడియా ద్వారా ప్రజలతో సంబంధం కొనసాగించడంలో కొంత నీరసం కనిపిస్తోంది. ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉండగా చూపిన చొరవ, ప్రభుత్వంలోకి వచ్చాక కొంత తగ్గినట్లు ఎక్స్లో కొన్ని పోస్టులు సూచిస్తున్నాయి. ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంలో సోషల్ మీడియా బృందాలు కొంత వెనుకబడినట్లు విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రత్యర్థులు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండగా, కాంగ్రెస్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా స్పందించడంలో వెనుకబడినట్లు కనిపిస్తోంది.ఎన్నికల విజయంలో సోషల్ మీడియా వారియర్స్ శ్రమ అపారమైనది. వీరు గ్రామీణ స్థాయి నుంచి నగరాల వరకు పార్టీ సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. అయితే, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా, ఈ కార్యకర్తలకు తగిన గుర్తింపు, పదవులు లభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిద్రాహారాలు మాని పనిచేశారని, కానీ అధికారంలోకి వచ్చాక వారి కృషిని పార్టీ నాయకత్వం గుర్తించడం లేదనే ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. ఇది పార్టీలో అంతర్గత అసంతృప్తిని పెంచే అవకాశం ఉంది.ప్రభుత్వంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వ్యూహం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే భిన్నంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో సోషల్ మీడియా కీలకం. ఉదాహరణకు, ఆరు గ్యారంటీల అమలు, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయవచ్చు. అయితే, ప్రస్తుతం ఈ దిశలో చురుకైన ప్రయత్నాలు కొరవడినట్లు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్పర్సన్ సుప్రియా శ్రీనాటే నాయకత్వంలో ప్లాట్ఫారమ్లు బలోపేతమైనప్పటికీ, రాష్ట్ర స్థాయిలో ఇదే స్థాయి చురుకుదనం కనిపించడం లేదుసోషల్ మీడియా కార్యకర్తలకు పదవులు, గుర్తింపు ఇవ్వడం కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే కాదు, పార్టీని బలోపేతం చేయడానికి కూడా అవసరం. ఈ కార్యకర్తలు గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు పార్టీ సందేశాన్ని అందించగల సామర్థ్యం కలిగి ఉన్నారు. వీరికి తగిన ప్రోత్సాహం, బాధ్యతలు అప్పగించడం ద్వారా సోషల్ మీడియా బందాలు మరింత ఉత్సాహంగా పనిచేస్తాయి. సోషల్ మీడియా కమిటీలలో బాధ్యతలు ఇస్తే, ఇది ఇతర కార్యకర్తలకు స్ఫూర్తిగా ఉంటుంది. గుర్తింపు లేని కార్యకర్తలలో నిరాశ పెరిగితే, భవిష్యత్ ఎన్నికలలో సోషల్ మీడియా శక్తి బలహీనపడే ప్రమాదం ఉంది.
భవిష్యత్ వ్యూహం..
తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బృందాలు భవిష్యత్తులో మరింత చురుకుగా మారాలంటే, కొన్ని కీలక చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వ విజయాల ప్రచారం: సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఆకర్షణీయమైన వీడియోలు, గ్రాఫిక్స్ ద్వారా ప్రజలకు చేరవేయాలి.
కార్యకర్తల ప్రోత్సాహం: సోషల్ మీడియా కార్యకర్తలకు రాష్ట్ర స్థాయిలో కమిటీలలో బాధ్యతలు, గుర్తింపు ఇవ్వడం ద్వారా వారి ఉత్సాహాన్ని పెంచాలి.
ప్రత్యర్థులకు సమాధానం: బీఆర్ఎస్, బీజేపీ సోషల్ మీడియా దాడులకు వాస్తవాలతో, వ్యూహాత్మకంగా స్పందించాలి.
స్థానిక సమస్యలపై దృష్టి: గ్రామీణ స్థాయిలో ప్రజల సమస్యలను సోషల్ మీడియా ద్వారా హైలైట్ చేసి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రచారం చేయాలి.
ఎన్నికల ముందు ఎట్ల ఉండే కాంగ్రెస్ సోషల్ మీడియా ఎన్నికల తరువాత ఎట్లా ఉంది కాంగ్రెస్ సోషల్ మీడియా .