YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి కన్నుమూత

భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి కన్నుమూత

న్యూఢిల్లీ జూన్ 24
క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్. భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి   (77) సోమవారం కన్నుమూశారు. లండన్‌లో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1979-1983 కాలంలో ఆయన భారత్ తరఫున 33 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. ఫస్ట్ క్లాస్‌‌లో 238 మ్యాచులు ఆడారు. టెస్టుల్లో 114, వన్డేల్లో 22, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 898 వికెట్లు తీశఆరు. ఇంగ్లండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 102 పరుగులు ఇచ్చి 6 వికెట్లు, ఆస్ట్రేలియాతో 103 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి.. తన కెరీర్‌లో బెస్ట్ ఫిగర్స్ సాధించారు. దిలీప్ మృతిపై బిసిసిఐ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో, రవిశాస్త్రి, వివిఎస్ లక్ష్మణ్ సహా పాటు పలువురు క్రికెటర్లు, అభిమానులు సంతాపం తెలిపారు.

Related Posts