YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అమెరికా దాడులకు నిరసిస్తూ సీపీఎం నిరసన

అమెరికా దాడులకు నిరసిస్తూ సీపీఎం నిరసన

హైదరాబాద్
ఇరాన్పై అమెరికా దాడులకు వ్యతిరేకంగా సిపిఎం నేతలు పాతబస్తీ సంతోష్ నగర్ ఐ ఎస్ సదన్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సౌత్ జిల్లా సెక్రెటరీ విఠల్ మాట్లాడుతూ ఆర్థిక సంక్షేమంలో అమెరికా కొట్టు మిట్టు లాడుతుందని ఆర్థిక సంక్షోభానికి బయటపడేందుకు ఇరాన్ పై అమెరికా దాడికి దిగటం హేయమని పేర్కొన్నారు. పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడిని ప్రోత్సహించటం దారుణమన్నారు. ప్రపంచశాంతికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలన్నారు. ఇప్పటి వరకూ భారత్ అవలంబిస్తున్న సంప్రదాయ విదేశాంగ విధానానికి ఇది విరుద్ధమని పేర్కొన్నాయి. అంతేకాకుండా ఇరాన్పై దాడితో ఆయిల్ సంక్షోభం వస్తుందని, దీనివలన దేశ ప్రజలపై భారాలు పడతాయని తెలిపాయి. అందువలన భారత ప్రభుత్వం వెంటనే అమెరికా దాడులను ఖండించాలని కోరాయి.
ఈ కార్యక్రమంలో నేతలు మీనా.అబ్దుల్ లతీప్.. మహమ్మద్ జోహాబ్. బాలు నాయక్. సత్తార్ భాయ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts