YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నెల తర్వాతే నోటిఫికేషన్

నెల తర్వాతే నోటిఫికేషన్

హైదరాబాద్, జూన్ 24, 
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ అంశంపై కోర్టులో జరిగిన వాదనల్లో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరో అరవై రోజుల సమయం కావాలని కోరింది. వాదనల్లో ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి అరవై రోజుల గడువు కోరింది. గతంలో జరిగిన విచారణల్లో గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఎందుకు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తెలంగాణలో జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల ఎన్నికల్లో జాప్యంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. గతంలోనే విచారణ జరిగింది.   జనవరి 30, 2025న జరిగిన విచారణలో, హైకోర్టు బెంచ్  పంచాయతీ రాజ్ శాఖను మూడు వారాలలో సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది.  కొంత జాప్యం తర్వాత ఇప్పుడు మళ్లీ విచారణకు  వచ్చింది. గత విచారణలో ప్రభుత్వం ఫిబ్రవరిలోపు ఎన్నికుల నిర్వహిస్తామని చెప్పింది.కానీ ఫిబ్రవరి ముగిసిపోయి మరో నాలుగు నెలలు గడిచిపోయినా ఎన్నికలు నిరవహించలేదు.  ఇప్పుడు మరో అరవై రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇది గ్రామీణ ప్రాంతాలలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దెబ్బతీస్తోందని పిటిషనర్ విచారణలో వాదించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సంవత్సరాలుగా నిర్వహించకపోవడం వల్ల సంబంధిత గ్రామాలకు సంక్షేమ కార్యకలాపాలు అందకుండా పోయాయని పిల్‌లో వాదించారు.              ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటి పోవడంతో పాటు అన్ని స్థానిక సంస్థలకు సంబందించిన పాలక వర్గాల గడువు ముగిసింది. అన్ని పాలక వర్గాలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. పంచాయతీల పదవీ కాలం 2024 జనవరి 31వ తేదీన, జిల్లా, మండల పరిషత్‌ల గడువు 2024 జులైలో ముగిసింది. స్థానిక సంస్థలకు పాలక మండళ్లు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది.  ఎన్నికలు ఇంకా ఆలస్యం అయితే ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 1,500 కోట్లు నష్టం జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి.మరో వైపు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి కూడా ఎన్నికలు నిర్వహించాలన్న ఒత్తిడి వస్తోంది. స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతోనే.. వెంటనే ప్రభుత్వం రైతు భరోసాని అమలు చేసిందని చెబుతున్నారు.  ఈసారి తైరు భరోసాని రైతులందరి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు మరో రెండు నెలల గడువు కావాలని హైకోర్టును కోరడంతో.. స్థానిక ఎన్నికలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంత మంది మంత్రులు.. వచ్చే పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నట్లుగా మాట్లాడటం కూడా వివాదాస్పదం అయింది.    

Related Posts