YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంలో అభివృద్ది లేకుండా విధ్వంసం సృష్టించిన జగన్

రాష్ట్రంలో అభివృద్ది లేకుండా విధ్వంసం సృష్టించిన జగన్

విజయవాడ
బీజేపి రాష్ట్ర మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి లేకుండా విద్వంసం సృష్టించారు. గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి అనేక సంక్షేమ పథకాలతో పాటు పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి వైపు తీసుకెళ్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రాజదాని కోసం ప్రధాని మోదీ వచ్చి పునః ప్రారంభించారు అలాగే నిధులు కేటాయించారు.
కార్ కింద పడి పోయిన వ్యక్తి పొరబాటున జరిగిన సంఘటన అని జగన్ ఒప్పుకోవాల్సింది పోయి మళ్ళి కేసు లు పెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నాడు. బనకచర్ల ప్రాజెక్ట్ కోసం కేంద్రం నిధులు కేటాయించింది. బనకచర్ల ప్రాజెక్ట్ పై జగన్ స్పందన ఏంటి. తెలంగాణ లో BRS, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడున్న జగన్ మాత్రం వీటిపై ఖండించకుండా మౌనం వహిస్తున్నారు. పోలవరం నుంచి వచ్చే నీళ్లు బోల్లాపల్లి మీదుగా నల్లమల్ల వైపు నీళ్లు తీసుకెళ్లి అక్కడ ప్రాంత ప్రజలకి ఉపయోగ పడేది ప్రాజెక్ట్. సముద్రంలో కలిసే నీళ్లని వృధా చేయకుండా  ఈ బనకచర్ల ప్రాజెక్ట్ తో  ఎంతో మందికి ఉపయోగపడనుంది. ప్రకాశం నెల్లూరు ఇలా అనేక ప్రాంత ప్రజలకి త్రాగునిటీ సమస్య లేకుండా ఎంతగానో  ఉపయోగపడుతుంది. వ్యాలి పరిసర ప్రాంతంలో నీళ్ళని నిల్వ ఉంచటం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి నీటి సమస్య లేకుండా ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తుంటే మరొక పక్క జగన్ సహించలేక నెగటివ్ ప్రచారాలు చేస్తున్నావు. గత ప్రభుత్వంలో మధ్యంలో ఇసుక లో అవినీతి చేసినట్టు కూటమి ప్రభుత్వంలో ఉండవు. బాధ్యతయుతంగా ఉన్నటువంటి వ్యక్తి పుష్ప లాంటి డైలాగ్స్ వేసి శాంతి భద్రతలకి విఘాతాం కలిపిస్తున్నావు. జగన్ అవినీతి సొమ్ము తో డబ్బు సంపాదించినవాడికి రాష్ట్ర ప్రజా సమస్యలు తెలియవు. కేంద్రంలో తల్లి కాంగ్రెస్ రాష్ట్రంలో పిల్ల కాంగ్రెస్ చేసే అరాచకాలతో అత్యవసర పరిస్థితులు ఏర్పడేలా చేశారని అన్నారు. 2024 లో శని పోయిందనుకున్నప్పడికి ఇంకా అడ్డు పడుతూనే ఉన్నాడని అన్నారు.

Related Posts