YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డ్రగ్స్ సరఫరా చేసిన యువకుడు అరెస్టు

డ్రగ్స్ సరఫరా చేసిన యువకుడు అరెస్టు

రంగారెడ్డి
ఈజీ మనీకి అలవాటుపడిన కొంతమంది యువకులు అనేక అడ్డదారులు తొక్కుతున్నారు.  నిషేధిత ఎండిఎంయే డ్రగ్స్ సరఫరా చేస్తూ తాజాగా ఓ యువకుడు ఎక్సయిజ్ పొలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే....రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా... అనుమానం వచ్చిన ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అతన్ని తనిఖీ చేయగా 23 గ్రాముల ఎండిఎంయే  డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. బెంగళూరు లో షరీఫ్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి ఒక్కో గ్రాము 3 నుంచి 5 వేల రూపాయల చొప్పున నగరంలో విక్రయిస్తున్నట్లు ఎక్సయిజ్ పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి ఎండిఎంయే డ్రగ్స్ తో పాటు ఓ పల్సర్ బైక్ , సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు జిల్లా అసిస్టెంట్ ఎక్సయిజ్ సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Related Posts