
రంగారెడ్డి
ఈజీ మనీకి అలవాటుపడిన కొంతమంది యువకులు అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. నిషేధిత ఎండిఎంయే డ్రగ్స్ సరఫరా చేస్తూ తాజాగా ఓ యువకుడు ఎక్సయిజ్ పొలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే....రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా... అనుమానం వచ్చిన ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అతన్ని తనిఖీ చేయగా 23 గ్రాముల ఎండిఎంయే డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. బెంగళూరు లో షరీఫ్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి ఒక్కో గ్రాము 3 నుంచి 5 వేల రూపాయల చొప్పున నగరంలో విక్రయిస్తున్నట్లు ఎక్సయిజ్ పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి ఎండిఎంయే డ్రగ్స్ తో పాటు ఓ పల్సర్ బైక్ , సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు జిల్లా అసిస్టెంట్ ఎక్సయిజ్ సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.