
హైదరాబాద్
సాయి శ్రీ , ఆన్ లైన్ బెట్టింగ్ ను సోషియల్ మీడియా లో ప్రోత్సహిస్తున్న ముఠా ను అరెస్ట్ చేశామని డీసీపీ, సైబర్ క్రైమ్ సాయి శ్రీ అన్నారు. నలుగురు ను అరెస్ట్ చేశాం. టెలిగ్రామ్ , ఇన్ స్టాగ్రామ్ లో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారు. 10వేలు పైన ఫాలోవర్స్ ఉన్నారు... బెట్టింగ్ చేయాలని మభ్య పెడుతున్నారు. బెట్టింగ్ ను ప్రమోట్ చేయడం ద్వారా ఓ యువకుడు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించాముని అన్నారు.
ఆర్బీఐ నిబంధనలు పాటించ కుండ, తాత్కాలిక యూపిఐ , అకౌంట్స్ ను ఏర్పాటు చేసుకొని లావాదేవీలు నడిపిస్తున్నారు . కమీషన్ తోనే ఒక్కొక్కరి 50 లక్షలు సంపాదించినట్లు గుర్తించాము. బెట్టింగ్ లో తెలుగు ప్రజలను టార్గెట్ గానే మోసం చేస్తున్నారు. 2019 నుండి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారని అన్నారు.
విదేశాల నుండి రన్ అవుతున్న 10 వెబ్ సైట్లు కు నిందితులు ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించాము. 2 లక్షలు మంది టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఉన్నట్లు గుర్తించామని అన్నారు.ఈ అక్రమ బెట్టింగ్ ద్వారా వచ్చిన కమిషన్లతో ఒక్కొక్కరు ₹50 లక్షల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. వీరు 2019 నుంచే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. విదేశాల నుంచి నడుస్తున్న 10 బెట్టింగ్ వెబ్సైట్లకు నిందితులు ప్రమోషన్ కల్పిస్తున్నట్లు కనుగొన్నారు.