
న్యూఢిల్లీ, జూన్ 26,
భారత వ్యామోగామి శుభాన్షు శుక్లా.. అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. భారత గగనయాన్ వ్యామోగాముల్లో ఒకరైన శుభాన్ష్ ఇప్పటికే భూ కక్ష్యలో ఉన్నారు. అంతకు ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ రాకేశ్ శర్శ, ఇండియన్ అమెరికన్స్ కల్పనాచావ్లా, సునీత విలియమ్స్ కూడా స్పేస్లోకి వెళ్లారు. అయితే భారతీయ పౌరుడిగా నాసాకు సంబంధించిన స్సేస్ మిషన్లో అంతరిక్షానికి వెళ్లిన రెండో భారతీయుడు శుభాన్ష్. మన భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెట్టిన అరుదైన సందర్భంలో వినువీధిలో మన వాళ్లు సత్తా గురించి మాట్లాడుకుందాంఅనేక రంగాల్లో సత్తా చాటే మనవాళ్లు.. అంతరిక్షంలోనూ అడుగుపెట్టారు. రోదసీయాత్రలు.. ఆకాశయానంలో భారత్ ఇంకా అంత ముందడుగు వేయలేదు కానీ.. నాసా ద్వారా మన భారతీయులు అంతరిక్షయానం చేశారు. అయితే…స్పేస్ ఎక్కువుగా జరిగే అమెరికాలో అనేక రూపాల్లో అంతరిక్షానికి వెళ్లొచ్చు. అలా ఇప్పటికే ఇద్దరు తెలుగు వ్యక్తులు భూమిని అెంతరిక్షం నుంచి చుట్టేశారు. ఇప్పుడు మరొకరు దానికి సిద్ధమవుతున్నారు. ప్రైవేట్ స్పేస్ మిషన్ల ద్వారా రెండు యాత్రలు పూర్తయ్యాయి. పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి 2029లో ఆస్ట్రోనాట్గా వెళ్లేందుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లారంటే..
భూమిని చుట్టేసిన బండ్ల శిరీష
బండ్ల శిరీష.. గుంటూరమ్మాయి.. తెనాలికి చెందిన బండ్ల అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయ మహిళ. సునీత విలియమ్స్, కల్పనా చావ్లా వెళ్లినప్పటికీ సునీత అమెరికన్ ఇండియన్. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షానికి వెళ్లింది బండ్ల శిరీషనే.. చిన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న శిరీష తర్వాత తన తల్లిదండ్రులతో కలిసి యుఎస్లోని హ్యూస్టన్కు వెళ్లిపోయారు. అక్కడే ఏరానాటికల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత మాస్టర్స్ చేసిన శిరీష..వెర్జిన్ అనే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సంస్థలో చేరారు. ప్రస్తుతం ఆ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 22 స్పేస్ మిషన్లో స్పేస్ టూరిస్ట్గా వెళ్లారు. యూనిటీ 22 , 2021లో భూమి సబ్ ఆర్బిటల్ స్పేస్కు వెళ్లింది. జీరో గ్రావిటీని ఫేస్ చేసిన రెండో భారతీయ మహిళగా.. తొలి తెలుగు వ్యక్తిగా శిరీష బండ్ల రికార్డు సృష్టించారు.
గగనయానం చేసిన తోటకూర గోపీచంద్..
మన వాళ్ల అంతరిక్ష యానం శిరీషతోనే ఆగలేదు. బెజవాడకు చెందిన గోపీచంద్.. కూడా స్పేస్ యాత్రను చేశాడు. అమెజాన్ అధిపతి కు చెందిన బ్లూ ఆరిజన్ న్యూషెపర్డ్ 25 వ్యామనౌకలో అంతరిక్ష యానం చేశారు. కమర్షియల్ పైలట్ అయిన గోపీచంద్.. యుఎస్లో ఓ వెల్నెస్ కంపెనీని నిర్వహిస్తున్నారు. 2024 ఆయన న్యూషెపర్డ్ క్రూతో కలిపి ఈ యాత్ర చేశారు.
జాహ్నవి దంగేటి కొత్త చరిత్ర –
స్పేస్లోకి వెళ్లనున్న తొలితెలుగు ఆస్ట్రోనాట్
పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి అనే 23 ఏళ్ల అమ్మాయి. 23ఏళ్ల జాహ్నవి 2029లో అంతరిక్షంలోకి వెళ్లనుంది. అమెరికాకు కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ 2029లో చేపట్టే స్పేస్ మిషన్లో జాహ్నవి అస్ట్రోనట్ క్యాండిట్ గా ఎంపికైంది. అంతకంటే ముందే ఆమె ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ను పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా నిలిచింది. ఇప్పటివరకూ స్పేస్కు వెళ్లిన మన వాళ్లు అంతరిక్ష యాత్రికులు స్పేస్ టూరిస్ట్ లకుమాత్రమే. కానీ జాహ్నవి ఓ అస్ట్రోనట్ గా వేళ్లనుంది. మూడేళ్ల పాటు ఆమె వ్యామోగామి శిక్షణ తీసుకోనుంది.తెలుగు విద్యార్థులకు STEM సబ్జెక్టుల్లో మొదటి నుంచి ఆసక్తి ఎక్కువ. మిగతా రాష్ట్రాల విద్యార్థులతో పోలిస్తే.. సౌత్లో అందునా.. ఏపీ, తెలంగాణలో సైన్స్ పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. IITల్లో చేరిన అమెరికాకు మాస్టర్స్కు వెళ్లేవాళ్లలోనూ.. తెలుగు వాళ్లు ఎక్కువుగానే ఉంటారు. ఆ ఆసక్తే మనవాళ్లు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి దోహదం చేస్తోంది. ఆకాశం అంచులను అందుకోవాలన్న తపనతో వీరంతా Space Exploration చేస్తున్నారు.