YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపాను నడిపించేది అమిత్ షా : ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య

వైకాపాను నడిపించేది అమిత్ షా : ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నడిపుస్తుంది జగన్ కాదు..అమిత్ షా.  జగన్ తన జీవితంలో ప్రతి శుక్రవారాన్ని కోర్టుకి అంకితం చేసుకున్నాడని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. శనివారం నాడు అయన మీడియాతో మాట్లాడారు.  ఆనాడు బాబు జగజ్జీవన్ రాం ప్రధాని కాకుండా దుష్టచతుష్టయంతో కలిసి కాంగ్రెస్ మోకాలడ్డింది .  దేశంలో మరలా దళితుడు ప్రధాని కావాలంటే అది చంద్రబాబు వూహంతోనే సాధ్యమని అన్నారు.  ఇప్పుడున్న కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ కాదు..ఈ కాంగ్రెస్ నకిలీ కాంగ్రెస్.  జగన్ చేస్తున్న రాజకీయం అంతా కేసుల నుండి బయట పడేందుకే నని అయన అన్నారు.  వైసీపీకి అధ్యక్షుడు జగన్ కాదు..అమిత్ షా.  మాదిగలకు అండగా ఉంటున్న పార్టీ టీడీపీయే. వైసీపీకి ప్రజలు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే. జగన్ కేసులు రుజువైతే తీహార్ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు.  జగన్ కేసుల భయంతో గజగజ వణికిపోతున్నాడు..కాపాడండి అంటూ నరేంద్ర మోడీ పాదాలపై పడుతున్నాడని అయన విమర్శించారు.

Related Posts