
కర్నూలు, జూలై 10,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగేళ్లల్లో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా స్థానికేతరులే అంటోంది. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రంలోని స్థానికేతర కోటాను ఏపీ విద్యార్థులకు కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈఏపీసెట్ కౌన్సెలింగ్కు హాజరైన తెలంగాణలో చదివిన విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచి స్థానికేతర కోటాలోని 15% సీట్లను కూడా ఏపీ విద్యార్థులకే కేటాయించేలా నిర్ణయం తీసుకుంది. 'ఇంజినీరింగ్లో చేరేముందు గత నాలుగేళ్లలో ఏ ఒక్క సంవత్సరం వేరే రాష్ట్రంలో చదివినా వారిని స్థానికేతరులుగా పరిగణిస్తారు' అని ప్రభుత్వం తెలిపిందిఆంధ్రప్రదేశ్లో పదో తరగతి వరకు చదివి, తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులను EAPCET కౌన్సిలింగ్లో స్థానికేతరులుగా చూపడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త రిజర్వేషన్ (స్థానికేతర కోటా) విధానాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలోని సీట్లన్నీ ఏపీ వారికే దక్కేలా జీవో జారీ చేసింది.. ఈ క్రమంలో ఈ అంశంపై అవగాహన లేని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన పరకారం EAPCET కౌన్సిలింగ్ (ఇంజినీరింగ్ సీట్ల భర్తీ) జరగనుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా, శ్రీవేంకటేశ్వర, ఆంధ్ర విశ్వవిద్యాలయాల రీజియన్లు ఉండేవి.. అయితే విభజన తర్వాత పదేళ్లు పూర్తికాగానే ఉస్మానియా రీజియన్ను తొలగించారు. కొత్త రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఏపీకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాల్లో ఉంటున్నారు. గతంలో వారిలో ఎవరైనా పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్లో ఉంటే కనుక స్థానికేతర కోటా (15% సీట్ల కోసం) కోసం పోటీలో ఉండొచ్చు. కాకపోతే కొన్ని జిల్లాలకు చెందిన చాలామంది తల్లిదండ్రులు ఏపీలో ఉంటూనే పిల్లల్ని మాత్రం తెలంగాణలోని కాలేజీల్లో ఇంటర్ చదివిస్తున్నారు. అప్పుడు వీళ్లు స్థానికేతర కోటా కింద సీటు పొందాలంటే.. వారు 10 ఏళ్లుగా ఏపీలో ఉంటున్నట్లు సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.అయితే తమ పిల్లలకు లోకల్ కోటాలో సీటు రాకపోడంపై తల్లిదండ్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన వారు వారి పిల్లల్ని పొరుగున ఉన్న రాష్ట్రాల్లో చదివిస్తున్నారు. ఉదాహరణకు కర్నూలుకు చెందిన వ్యక్తి తన కూతుర్ని తెలంగాణలో ఇంటర్ చదివించారు.. ఆమెకు మంచి మార్కులు వచ్చాయి. అయితే EAPCETలో మంచి ర్యాంకు కూడా వచ్చింది.. ఆయన కూతురికి కర్నూలు ఇంజినీరింగ్ కాలేజీలో సీటు వస్తుంది అనుకున్నారు. కానీ నాన్-లోకల్ అని చూపించడంతో ఆందోళనలో ఉన్నారు. దీంతో తమ పిల్లలు పదో తరగతి వరకు ఏపీలోనే చదివారని గుర్తు చేస్తున్నారు.. అందుకే వారినిలోకల్ కింద పరిగణించాలని కోరుతున్నారు. చాలామందికి కొత్త రూల్స్ గురించి తెలియక ఆందోళనలో ఉన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.