YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భయాన్ని తరిమికొట్టేది నిగ్రహ మార్గమే..

 భయాన్ని తరిమికొట్టేది నిగ్రహ మార్గమే..

మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌కు చెందిన గుమ్షత్‌నగర్ నివాసి పుష్పా ఛజ్లానీ(55) దీక్ష తీసుకుని సంసారిక వ్యామోహాలను విడిచిపెట్టింది. ఆచార్య దౌలత్‌సాగర్ సురీశ్వర్ సమక్షంలో ఇతర సాధువుల మధ్య ఆమె దీక్ష తీసుకుని తన పేరును శుద్ధి ప్రశన్నాశ్రీజీగా మార్చుకుంది. ఏడాది క్రితం ఆమె ఇద్దరు కుమార్తెలు దీక్ష తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. దీక్ష తీసుకున్న పుష్ప మాట్లాడుతూ ‘దీక్ష తీసుకోవాలనుకున్న నా కల ఈనాటికి నెరవేరింది. దీక్ష తీసుకునేవారు సంసారాన్ని త్యాగం చేస్తూ నిగ్రహాన్ని నిలబెట్టుకోవాలి. ఈ నిగ్రహ మార్గమే జీవితంలోని అన్ని భయాలను తరిమికొడుతుంది. ఒక లక్ష్యమంటూ లేకుండా జీవించేవారు ఏమీ సాధించలేరని’ అన్నారు.

Related Posts