YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం లో కేంద్రంపై మండిపడ్డ చంద్రబాబు..!!

నీతి ఆయోగ్‌ పాలకమండలి  సమావేశం లో కేంద్రంపై మండిపడ్డ చంద్రబాబు..!!

నీతి ఆయోగ్‌ పాలకమండలి నాలుగో సమావేశం దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.  ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ కేంద్రం వైఖరిని చంద్రబాబు ఎండగట్టారు. ఆదాయంలో ఏపీ సేవారంగం వృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగిందని పేర్కొన్నారు. విభజన చట్టంలోని అంశాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కావాల్సిన నిధులు సమకూర్చాలని అడిగారు. 

Related Posts