YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మెడికల్ లీవ్ లో పైలెట్లు

మెడికల్ లీవ్ లో పైలెట్లు

ముంబై, జూలై 25, 
అహ్మదాబాద్‌లో జరిగిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ దుర్ఘటన తర్వాత నాలుగు రోజుల్లో 100 మందికిపైగా ఏయిరిండియా పైలట్లు మెడికల్ లీవ్ తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటన చేసింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహుల్ గురువారం లోక్‌సభలో ప్రసంగిస్తూ.. 274 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటనపై పైలట్ల మానసిక ఆరోగ్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. విమాన ప్రమాదం జరిగిన రోజే 51 మంది పైలట్టు, 61 మంది ఫ్లైట్ ఆఫీసర్లు లీవ్ పెట్టడం ప్రభుత్వం దృష్టిని ఆకర్షించింది.ఇటువంటి ఘటనల తర్వాత సిబ్బందిలో మానసిక ఒత్తిడిని గుర్తించి, దాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. 2023 ఫిబ్రవరిలోనే కేంద్రం అన్ని ఎయిర్‌లైన్స్‌కు పలు సూచనలు చేసింది. వైద్య పరీక్షల సమయంలో పైలట్ల మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయడం, పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, పియర్ సపోర్ట్ గ్రూపులు ఏర్పాటు చేసి, పైలట్లు, ఏటీసీలకు మానసిక ఒత్తిడిని గుర్తించేందుకు, ఎదుర్కొనేందుకు సహాయం చేయాలని సూచించింది.కాగా, సిబ్బంది విశ్రాంతి, శిక్షణ, ఆపరేషన్ లోపాలపై డీజీసీఏ నుంచి నాలుగు షోకాజ్ నోటీసులు అందినట్టు ఎయిరిండియా ధ్రువీకరించింది. గతేడాది తమ సంస్థ అందజేసిన స్వచ్ఛంద నివేదిక ఆధారంగా ఈ నోటీసులు జారీ అయినట్టు తెలిపింది. ఎయిరిండియా ప్రతినిధి స్పందిస్తూ: ‘మా స్వచ్ఛంద నివేదికల ఆధారంగా వచ్చిన నోటీసులే... వాటికి తగిన విధంగా స్పందిస్తాం… సిబ్బంది, ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీలేదు’ అన్నారు. కాగా, గత ఆరు నెలల్లోనే ఎయిరిండియాకు 13 భద్రతా ఉల్లంఘనల నోటీసులు రావడం గమనార్హం.రెండు రోజుల కిందట హాంకాంగ్ నుంచిడి ఢిల్లీకి వచ్చిన A321 విమానంలో ల్యాండ్ అయిన కాసేపటికే మంటలు చెలరేగాయి. దీనికి ముందు రోజు కోచి-ముంబయి ఫ్లైట్ రన్‌వే అదుపుతప్పడంతో ఇంజిన్ కవర్ దెబ్బతింది. అలాగే, ఢిల్లీ-కోల్‌కతా విమానం చివరి నిమిషంలో టేకాఫ్‌ నిలిచిపోయింది. ఇలా వరుస ఘటనలు ఎయిరిండియా విమానాల్లో భద్రతపై ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటు, అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్స్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక అందజేసింది. పైలట్లు ఇంధనం స్విచ్ఛ ఆఫ్ చేసినట్టు కాక్‌పిట్ వాయిస్‌ రికార్డులో ఉందని విదేశీ మీడియా కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను పైలట్ల సంఘం, విమానయాన నిపుణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. బోయింగ్ విమానాలు నడుపుతున్న అన్ని దేశీయ విమానయాన సంస్థలకు ఇంధన స్విచ్‌లను పరీక్షించాలని డీజీసీఏ ఆదేశించింది.

Related Posts