
అనంతపురం, జూలై 28,
కడపలో కూడా వైసీపీ పట్టు నిలుపుకోలేకపోయింది. దాంతో మొన్నటి ఎన్నికల తర్వాత కూటమి కాన్సంట్రేషన్ ఓవర్ టు సీమ అయిపోయింది.వైసీపీని తిరిగి అక్కడ కోలుకోకుండా చేస్తే ఇంకో రెండు మూడు టర్మ్లు తమదే పవర్ అని అంచనా వేస్తోంది టీడీపీ. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మహానాడుకు కడపనే వేదికగా ఎంచుకుంది సైకిల్ పార్టీ. జగన్ కంచుకోటలో మూడురోజుల పాటు మహానాడు నిర్వహించి..లక్షలాది మందితో సభ పెట్టి..జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో పసుపు మయం చేసి పబ్లిక్ అటెన్షన్ గ్రాబ్ చేసే ప్రయత్నం చేసింది.తెలుగుదేశం పుట్టాక చాలా నగరాల్లో మహానాడు పెట్టారు. కానీ ఫస్ట్ టైమ్ హిస్టరీలో సాధించనన్ని సీట్లు సాధించిన తర్వాత కడపను టార్గెట్ చేస్తూ బ్రహ్మాండంగా పార్టీ పండుగను నిర్వహించి వైసీపీకి తన సత్తా ఏంటో చూపించింది టీడీపీ. సేమ్టైమ్ జనసేన పరంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వరుసగా కడప పర్యటనలు చేస్తూ..జగన్ అండ్ వైసీపీ నేతలకు వార్నింగ్లు ఇస్తూ వస్తున్నారు.ఇప్పుడు కూటమిలో మరో మిత్రపక్షం వంతు అన్నట్లుగా ఉంది. బీజేపీ కూడా కడప నుంచే తన కార్యాచరణకు రెడీ అవుతోంది. బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా నియమితులైన పీవీఎన్ మాధవ్ రాష్ట్ర పర్యటనలకు సిద్ధం అవుతున్నారు. వాటిని కడప నుంచే మొదలు పెడతామని ప్రకటించారు. కడపను రాజకీయ కోణంలో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చూస్తున్నాం.. అందుకే కడపను ఎంచుకుంటున్నామని చెబుతున్నారు.దేవుని తొలి గడప కడప అని మాధవ్ చెప్పారు. అందుకే సారధ్యం పేరుతో రాష్ట్ర పర్యటన త్వరలోనే మొదలవుతుందని అంటున్నారు. తొలి శాసనం దొరికిన జిల్లాగా అలాగే తెలుగు జాతి తెలుగు సంస్కృతికి ప్రధాన ద్వారంగా నిలిచిన కడప నుంచి పర్యటన స్టార్ట్ చేస్తామంటున్నారు. ఐదు విడతలుగా సారధ్యం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్..అక్కడి నుంచే పార్టీ యాక్టివిటీస్ను మొదలెడతారని అంతా అనుకున్నారు. కానీ మాధవ్ తన తొలి రాష్ట్ర పర్యటనను రాయలసీమ నుంచి పైగా జగన్కు, వైసీపీకి హార్డ్ కోర్ జిల్లా అయిన కడప నుంచి ప్రారంభిస్తుండటం ఆసక్తికరంగా మారింది.కూటమి పార్టీలన్నీ తమ బలాన్ని పెంచుకోవడానికి కార్యక్షేత్రంగా కడపనే ఎంచుకుంటున్నాయి. పవన్ కూడా అనేక సార్లు రాయలసీమలో పర్యటిస్తూ వస్తున్నారు. కడపలో రచ్చబండ కార్యక్రమం పెట్టారు. ఆ మధ్యే కడప వెళ్ళి మరీ ఎంపీడీవో మీద జరిగిన దాడిని ఖండించి వచ్చారు పవన్. ఏకంగా రాయలసీమలోనే క్యాంప్ ఆఫీస్ పెడతానంటూ ప్రకటించేశారు. రాయలసీమ మీ జాగీరు కాదు..గూండాగిరి చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్.కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ఇక కడపలో పర్యటించి..సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నాయని ఆరోపిస్తున్న అటవీ భూములను పరిశీలించారు. సీఎం చంద్రబాబు కూడా నెలలో కనీసం రెండు సార్లకు తక్కువ కాకుండా సీమ జిల్లాల టూర్లు వేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా రాయలసీమపైనే ఫోకస్ పెడుతోంది. దాంతో వైసీపీ వర్సెస్ కూటమిగా రాయలసీమ రాజకీయం మారిపోయింది.తిరిగి తన పట్టును సాధించేందుకు..గత వైభవం తెచ్చుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. మూడు కీలక పార్టీలు అంతా కలసి సీమ మీద కన్ను వేయడంతో వైసీపీకి సవాల్గా మారింది. జగన్ కంచుకోట సెంట్రిక్గా కూటమి పార్టీలు చేస్తున్న ప్లాన్లు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
==============
07 అనిల్ కుమార్ మిస్సింగ్...
నెల్లూరు, జూలై 28, (న్యూస్ పల్స్)
ధికారంలో ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడవచ్చు. ఏవేవో మాట్లాడవచ్చు. ఎంతటి మాటలనైనా అనేయవచ్చు. కానీ అధికారం కోల్పోతే ఉంటుంది సామి రంగా. . అచ్చం అనిల్ కుమార్ యాదవ్ లా ఉంటుంది. ఓ చిన్నపాటి కేసులో విచారణకు ఆయనను పిలిచారు పోలీసులు. కానీ డుమ్మా కొట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అనిల్ కుమార్ యాదవ్. తనపై పోలీసులు పెట్టిన కేసు కొట్టి వేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ లో భయాన్ని చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఏంటి మన అనిల్ యేనా? అని ఆశ్చర్యపోతున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ తీరును చూసి నవ్వుకుంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తొడలు కొడుతూ.. మీసం మేలేస్తూ అనిల్ కుమార్ యాదవ్ చేసిన హంగామా అంతా అంతా కాదు. ఇప్పటికీ ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.మొన్న ఆ మధ్యన నెల్లూరు జిల్లాలో ఒక వివాదం నడిచిన సంగతి తెలిసిందే. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై (మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. అదే సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పై దాడి కూడా జరిగింది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించే క్రమంలో ప్రశాంతి రెడ్డి పై అనిల్ కుమార్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిని ఖండిస్తూ ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అకారణంగా దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కేసులో ఏ1 గా ప్రసన్న కుమార్ రెడ్డి, ఏ 2 గా అనిల్ కుమార్ యాదవ్ గా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణకు హాజరుకావాలని అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు అందించారు. కానీ ఏ 1 గా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు, ఏ 2 గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అలా వెళ్తూనే హైకోర్టులో తనపై కేసు కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన విస్మయం వ్యక్తం అవుతుంది. చిన్నపాటి కేసుకే అనిల్ భయపడిపోతున్న తీరును వారు తప్పు పడుతున్నారు.వైయస్సార్ కాంగ్రెస్అధికారంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయేవారు. మీసం మేలేసేవారు.. తొడగొట్టేవారు. పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ ను తక్కువ చేసి మాట్లాడేవారు. చంద్రబాబు వయసును చూసి కూడా గౌరవించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు అధికారం తారుమారు కావడంతో అసలు తత్వం బోధపడింది. ఎన్నికల ఫలితాల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్రంలోనే ఉండడం లేదు. పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అనవసరంగా వచ్చి చిన్నచిన్న కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అసలు పెద్ద కేసులు ఆయన కోసం ఎదురుచూస్తున్నాయి. మున్ముందు చుక్కలు కనిపించే పరిస్థితులు ఉన్నాయి. కానీ చిన్నపాటి దూషణ కేసును కూడా ఆయన ఎదుర్కొనలేకపోతున్నారు. మున్ముందు పెద్ద కేసులు ఎదురైతే పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.అయితే ప్రశాంతి రెడ్డి పై దూషణ కేసుకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ భయపడడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఈ కేసులో ఏ 1 ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేయలేదు. కానీ తన విషయంలో మాత్రం అరెస్టు ఉంటుందని అనిల్ కుమార్ యాదవ్ కు తెలుసు. ఎందుకంటే క్వార్జ్ కుంభకోణం కేసులో ఆయన పిఏ ఇప్పటికే అరెస్టయ్యారు. ఆయన ఇచ్చిన సమాచారంతో అనిల్ కుమార్ కు కూడా ఈ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయని ఆధారాలు సేకరించారు పోలీసులు. అందుకే హైకోర్టు కలుపుతారు అనిల్ కుమార్ యాదవ్. పేరు దూషణ కేసు అయిన.. మైనింగ్ కుంభకోణం కేసులో బయటపడేందుకే నన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికైతే అనిల్ కుమార్ యాదవ్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.