
విశాఖపట్నం
స్టీల్ప్లాంటులో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న రవికుమార్ ఇంట్లో భారీగా విదేశీ మద్యంతోపాటు డిఫెన్స్, ఇతర రాష్ట్రాలకు చెందిన 66 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీఎం పాలెంలోని ఎంవీవీ సిటీలో ఫ్లాట్ నంబర్ 8088లో విదేశీ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ ఎస్ఐ ముసలనాయుడు బృందం సోదాలు జరిపింది. ఆయన ఇంట్లో 18 విదేశీ, 16 డిఫెన్స్, ఒడిశా, గోవా మద్యం సీసాలు ఒక్కొక్కటి, తెలంగాణ మద్యం సీసాలు 11, హరియాణ రాష్ట్ర మద్యం బాటిళ్లు ఏడు, మహారాష్ట్రకు చెందినవి రెండు స్వాధీనం చేసుకున్నారు. రవికుమార్ పరారీలో వున్నాడు.