YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనంతలో రాహుల్ జన్మదిన వేడుకలు

అనంతలో రాహుల్ జన్మదిన వేడుకలు
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 48 వ జన్మదిన  వేడుకలు  ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నిరుపేద మహిళలకు,విద్యార్థులు,ఆటో డ్రైవర్లుకు 48వ బర్త్ డే కానుకగా 48 మందికి  చీరలు, పుస్తకాలు,ఆటో డ్రైవర్ యూనిఫామ్, రక్తదాన కార్యక్రమాలు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సమక్షంలో జరిగాయి. 2019లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తో పాటు కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం రైల్వే జోన్  వంటివి వస్తాయని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. పలువురు జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts