YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మహా కళాకారుడు వేణుమాధవ్. ఆయన మృతి తీరని లోటు

మహా కళాకారుడు వేణుమాధవ్. ఆయన మృతి తీరని లోటు
ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు, అంతర్జాతీయంగా తెలుగువారికి ఎంతో కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చిన స్వర బ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్గారి మృతి మొత్తంగా తెలుగుజాతికి తీరని లోటు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, దేశ వ్యాప్తంగా ఆయనకు అసంఖ్యాకంగా అభిమానులున్నారని, దశాబ్దాలుగా ఆయన వందలమంది మిమిక్రీ కళాకారులకు మార్గదర్శనం చేశారని జగన్ అన్నారు. అనేక భారతీయ భాషల్లో స్వరానుకరణ,  హాలీవుడ్ నటుల స్వరాలను కూడా అలవోకగా పలికించటంతో పాటు హాస్యం పండించటం ద్వారా ఆయన కోట్ల హృదయాలకు చేరువయ్యారని జగన్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related Posts