YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సెప్టెంబర్ వరకు ప్రత్యేక రైళ్లు

 సెప్టెంబర్ వరకు ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం నుంచి తిరుపతి, సికింద్రాబాద్‌ నగరాలకు వారానికోసారి రాకపోకలు సాగిస్తున్న ప్రత్యేక రైళ్లను సెప్టెంబర్‌ నాలుగో వారం వరకు పొడిగిస్తూ, తూర్పు కోస్తా రైల్వే అధికారులు పచ్చజెండా ఊపారు. రైలు నెంబరు 08573 ఈ నెల 26తో గడువు ముగియనుంది. ఆ రైలు జూలై 3 నుంచి సెప్టెంబర్‌ 25 వరకు ప్రతీ సోమవారం రాత్రి 10.55 గంటలకు విశాఖలో బయల్దేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 1.25 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08574 రైలు ఈ నెల 27 గడువు పూర్తవుతుంది. దాన్ని జూలై 4 నుంచి సెప్టెంబర్‌ 26 వరకు ప్రతీ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతిలో బయల్దేరి, ఆ మర్నాడు ఉదయం 6.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. స్టాపేజీలు, బోగీల కాంబినేషన్‌లో ఏ మాత్రమూ మార్పు లేదు.08501 నెంబరు రైలు ఈ నెల 26 లోపు గడువు ముగుస్తుంది. దాన్ని వచ్చేనెల జూలై 4నుంచి సెప్టెంబర్‌ వరకు 26 వరకు 13 ట్రిప్పులు పొడిగించారు. ప్రతీ మంగళవారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి ఆ మర్నాడు మద్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08502 రైలు జూలై 5నుంచి 27 వరకు ప్రతీ బుధవారం మద్యాహ్నం 4.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి ఆ మర్నాడు తెల్లవారి 4.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. స్టాపేజీలు, 8 బోగీల కాంబినేషన్‌లో ఎటువంటి మార్పులు లేవని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిసిఎం కో-ఆర్డినేషన్‌ జి సునీల్‌కుమార్‌ తెలిపారు.

Related Posts