YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపా స్థానాలన్నీ టీడీపీకే

 వైకాపా స్థానాలన్నీ టీడీపీకే
జగన్నాటకంలో వైకాపా ఎంపీల రాజీనామాలు స్పీకర్ ఆమోదించారు. ప్రధాని మోదీని పార్లమెంట్లో తిట్టలేక రాజీనామాల ఆస్త్రం ప్రయోగించారని మంత్రి జవహర్ అన్నారు. శనివారం నాడు ఏలూరులో తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయకమిటీ సమావేశంలో అయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ  రాజీనామా చేసిన ఎంపీల స్థానాల్లో పోటీ చేసే ధైర్యం వైకాపాకి లేదు.రానున్న ఎన్నికల్లో అన్నీ ఎంపీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుందని అయన అన్నారు.  ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం అమరణనిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేష్, రవిలకు మంత్రి  సంఘీభావం ప్రకటించారు.  కాకినాడలో జరిగే ధర్మపోరాట దీక్షను ప్రతి ఒక్కరూ తరలి రావాలి.  నెల్లూరులో నిర్వహించే దళితతేజం-తెలుగుదేశం ముగింపు మహాసభను విజయవంతం చేయాలని అయన సూచించారు.

Related Posts