YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ వ్యవహారాలపై సీబీఐ విచారణ వేయాలి

టీటీడీ వ్యవహారాలపై సీబీఐ విచారణ వేయాలి
తిరుమల శ్రీవారి దేవాలయాన్ని పరిరక్షించే  మహాయజ్ఞంలో  భక్తులందరూ  నాకు సహకరించాలి. మీడియా యాజమాన్యాలు  పారదర్సకతతో, నిస్వార్థంగా ప్రజలకు సమాచారం అందించాల్సిన  అవసరం ఉందని  తిరుమల  మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నాతో పాటు ప్రెస్ మీట్ లో పాల్గొన్న అనిల్ ను అప్పుడే నేను చూశాను. అనిల్ ను గతంలో ఎప్పుడు కలవలేదు. ఏ విషయం గురించి మాట్లాడలేదని అయన స్పష్టట ఇచ్చారు. టిటిడి  వ్యవహారంపై  ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తానని చెప్పి నాతో పాటు మీడియా సమావేశంలో అనిల్ పాల్గొన్నారు. అర్చకులకు  నాలుగు సంవత్సరాలుగా సరైన భోజనం పెట్టని దుస్థితి టిటిడి  ఉన్నతాధికారులది. నేను చెప్పిన ప్రతి విషయాన్ని మీడియా విచారించి భక్తులకు నిజాలను  తెలియజేయాలని అయన డిమాండ్ చేసారు. వెంటనే సిబిఐ విచారణ జరపాల్సిన అవసరం ఉందని అయన అన్నారు.

Related Posts