YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

'అర్జున్ రెడ్డి' నిర్ణయానికి బాలీవుడ్ తారలు ఫిదా..!!

 'అర్జున్ రెడ్డి' నిర్ణయానికి బాలీవుడ్ తారలు ఫిదా..!!

 ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాకు గానూ విజయ్‌ ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డును ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేస్తున్నట్లు విజయ్‌ ప్రకటించారు. ఈ అవార్డును వేలం వేసి దాని ద్వారా వచ్చే డబ్బును ఆపదలో ఉన్నవారికి ఇవ్వాల్సిందిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరారు.
 అయితే విజయ్‌ నిర్ణయం పట్ల అటు బాలీవుడ్‌ ప్రముఖులు జూహీ చావ్లా, రిచా చద్దా, శిఖ తలసానియా తదితరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ నిర్ణయంపై జూహీ స్పందిస్తూ..‘నటీనటుల జీవితంలో అవార్డులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ విజయ్‌ తీసుకున్న నిర్ణయం అంతకంటే గొప్పది. అభిమానులు సెలబ్రిటీల నుంచి ఎంతో స్ఫూర్తిపొందుతారు’ అని తెలిపారు.

Related Posts